పల్లె, పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలి
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
కార్పొరేషన్, జూన్ 16: స్థానిక సంస్థల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరావు అన్నారు. పల్లె, పట్టణ ప్రగతి పనుల పురోగతిపై సీఎస్ బుధవారం కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరంగల్ నుంచి పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ సర్కారు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ప్రజలకు తడి, పొడి చెత్తను వేరు చేయడంపై అవగాహన కల్పించాలన్నారు. హరితహారంలో మొక్కలు నాటేందుకు సన్నద్ధం కావాలని నిర్దేశించారు. ఉన్నతాధికారులు గ్రామాల్లో పర్యటించి, పల్లె నిద్ర చేసి సమస్యలు తెలుసుకోవాలన్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారంపై సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు. అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి పనుల పురోగతిని తెలుసుకోవాలని ఆదేశించారు.
పట్టణ ప్రగతిపై దృష్టి సారించాలి..
పట్టణ ప్రగతి కింద పట్టణాల్లో పచ్చదనం పెం పొందించే దిశగా రోడ్డుకు ఇరు వైపులా ఎతైన మొకలు నాటి సంరక్షించాలని ఆదేశించారు. అర్బన్ పారులను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి మున్సిపాల్టీలో కేటాయిస్తున్న 10 శాతం గ్రీన్ బడ్జెట్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమీకృత మారెట్ల నిర్మా ణం కోసం చర్యలు తీసుకోవాలని, అనువైన స్థలా న్ని ఎంపిక చేసి ప్రతిపాదనలు సమర్పించాలని సూ చించారు. హరితహారాన్ని ప్రారంభించిన 15 రో జుల్లో మొకలు నాటే కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో 10 లక్షల మొకల పెంపకం లక్ష్యంగా 3 మెగా న ర్సరీలు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, దీని కోసం అనువైన స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు.
అడవుల పునరుద్ధ్దరణే లక్ష్యంగా హరితహారం నిర్వహించాలని, జిల్లాలో అందుబాటులో ఉన్న అటవీ భూమాల్లో బ్లాక్ప్లాంటేషన్ చేయాలని, దీనిని జిల్లా స్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షించాలని సీఎస్ ఆదేశించారు. ఈ యేడు లక్ష్యం మేరకు మొక్కలు నాటాలన్నారు. ధరణి పోర్టల్లో వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు ప రిషరించాలని సూచించారు. ప్రత్యేక ఆహారం శుద్ధి కేంద్రాల స్థాపన కోసం ప్రతి జిల్లా 150 ఎకరాల స్థలాన్ని గుర్తించి అందించాలని, సదరు ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేసి భూమి వివరాలను అందించాలని సీఎస్ ఆదేశించారు. పల్లె, పట్టణ ప్రగతి పురోగతిని పరిశీలించేందుకు ఈ నెల 20 తర్వాత సీఎం కేసీఆర్ ఆకస్మిక పర్యటనలుంటాయన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, డీఎంహెచ్వో జువేరియా, డీపీవో వీరబుచ్చయ్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.