3.89 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ
విలువ రూ. 734 కోట్లు
అదనపు కలెక్టర్ వీ లక్ష్మీనారాయణ
పెద్దపల్లి జంక్షన్ జూన్ 16: జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేశామని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఏసీ తన చాం బర్లో ధాన్యం కొనుగోళ్ల వివరాలను బుధవారం వెల్లడించారు. గతేడాది యాసంగి సీజన్లో 3.68 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశామని, ఈ ఏడాది 3.89 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని వివరించారు. కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని తెలిపారు. ఈ మేరకు 2020 -21 యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు జిల్లాలో 292 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 3,89,195 మెట్రి క్ టన్నుల ధాన్యాన్ని 57,494 మంది రైతుల నుంచి సేకరించామని వివరించారు. రూ. 734 కోట్ల విలువైనదని కొనుగోలు చేయగా, ఇప్పటి దాకా రూ. 678. 08 కోట్లు చెల్లించామని తెలిపారు. మిగతా వారికి చెల్లిస్తున్నామని చెప్పారు.
9 జిల్లాల నుంచి…
పెద్దపల్లి జిల్లాతో మరో 9 జిల్లాల నుంచి ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి 75,000, నిర్మల్ జిల్లా నుంచి 50,000, సిరిసిల్ల జిల్లా నుంచి 10,000 భూపాలపల్లి జిల్లా నుంచి 50,000, మహబుబాబాద్ జిల్లా నుంచి 40,000, జగిత్యాల జిల్లా నుంచి 6,000, ఆదిలాబాద్ జిల్లా నుంచి 500, ములుగు జిల్లా నుంచి 50,000, మంచిర్యాల జిల్లా నుంచి 70,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి స్థానిక మిల్లులకు తరలించామని వివరించారు. ఇక్కడ పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ప్రవీణ్, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్, డీఆర్డీవో శ్రీధర్, జిల్లా సహకార అధికారి మైకెల్ బోస్ ఉన్నారు.