పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి
పెద్దపల్లిటౌన్, జూన్ 16: సీఎం కేసీఆరే తమ నాయకుడని, ఆయన పాలనే రాష్ర్టానికి శ్రీరామ రక్ష అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. ఆయన క్యాంపు కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ, రాష్ర్టాన్ని అన్ని రం గాల్లో అభివృద్ధి చేస్తున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందని వివరించారు. తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్దే విజయమని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడాలేని విధం గా వ్యవసాయాన్ని పండుగలా చేసుకునేలా రైతు బంధు, రైతుబీమాలాంటి పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ధాన్యం దిగుబడిలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందంటే కేసీఆర్ తీసుకున్నా సహసోపేత నిర్ణయాలు కారణమని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాలకు పైగా భూములు సాగులోకి వచ్చాయని తెలిపారు. ని యోజకవర్గంలోని లక్షమంది రైతులకు రూ.74కోట్లకుపైగా రైతు బంధు నిధులు విడుదల చేయడంపై ప్రజల పక్షాన కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో ప్రతి ఇంటికీ పండ్ల మెక్కలు, పెరటి తోటల పెంపకానికి కూరగాయల విత్తనాలు పంపిణీ చేస్తానని వివరించారు. ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో రోడ్లు, పారిశుధ్యం, హరితహరంపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో జడ్పీటీసీ బండారు రాంమూర్తి, ఎంపీపీలు బండారు స్రవంతి, రమాదేవి, స్రవంతి, సంపత్యాదవ్ పాల్గొన్నారు.