స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన వెంకట్రామ్రెడ్డి
జిల్లా అభివృద్ధ్దిలో ప్రముఖ పాత్ర
సీఎం కేసీఆర్ నేతృత్వంలో పథకాల అమలు, ప్రాజెక్టుల పూర్తికి కృషి
సిద్దిపేట అర్బన్, నవంబర్ 15 : సిద్దిపేట కలెక్టర్ పీ.వెంకట్రామ్రెడ్డి ఉద్యోగానికి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. సీఎస్ సోమేశ్ కుమార్కు సోమవారం తన రాజీనామా లేఖను అందించగా.. ప్రభుత్వం ఆయన వీఆర్ఎస్ను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు నేతృత్వంలో జిల్లా అభివృద్ధిలో ఆయన కీలకపాత్ర పోషించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో వెంకట్రామ్రెడ్డి పాలు పంచుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిలిచేలా గజ్వేల్లో ఆర్అండ్ఆర్ కాలనీని నిర్మించడంలో ఆయన శ్రమించారు. 30 ఏండ్లలో ఎక్కడా నిర్మించని విధంగా 6 వేల కుటుంబాలకు ఆర్అండ్ఆర్ కాలనీని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్మించారు. సిరిసిల్ల కలెక్టర్గా సైతం మిషన్ భగీరథ లాంటి పథకాన్ని వంద శాతం పూర్తిచేశారు. రైల్వేలైన్కు సంబంధించి భూ సేకరణను 90శాతం పూర్తి చేయించడంలో విశేష కృషి చేశారు. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్ రిజర్వాయర్ల భూసేకరణలో కీలకపాత్ర పోషించారు. సిద్దిపేట జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్లు, మిషన్ భగీరథ, ఆర్అండ్ఆర్ కాలనీల నిర్మాణంలో ప్రముఖపాత్ర వహించడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో పాటు మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణకు విశేష కృషి చేశారు.
వెంకట్రామ్రెడ్డి బయోడేటా..
వెంకట్రామ్రెడ్డి స్వస్థలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలోని ఓదెల. తండ్రి రాజిరెడ్డి ప్రముఖ న్యాయవాది. 1996లో గ్రూప్-1 ఉద్యోగం సాధించిన వెంకట్రామ్రెడ్డి పలు హోదాల్లో పనిచేశారు. బందర్, చిత్తూరు, తిరుపతిలో ఆర్డీవోగా పనిచేశారు. డ్వామా పీడీ మెదక్, హుడా సెక్రెటరీ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, ఇన్క్యాప్ ఎండీ, మెదక్ జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాల పునర్వవ్యస్థీకరణ తర్వాత సిద్దిపేట కలెక్టర్గా నియమితులయ్యారు. నాటి నుంచి నేటి వరకు సిద్దిపేట కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించినా మధ్యలో కొన్ని రోజులు సిరిసిల్ల కలెక్టర్గా పనిచేశారు. మొత్తంగా ఏండేండ్ల పాటు జాయింట్ కలెక్టర్, కలెక్టర్గా వెంకట్రామ్రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు.