డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్
కురవి, జూన్15: రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ తపనతోనే తెలంగాణ నేడు పచ్చని పంటలతో సస్యశ్యామలంగా మారిందని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మంగళవారం ఆయన కురవి మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో కురవి, డోర్నకల్ మండలాల్లో సాగునీటి సమస్యలపై ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రూ.60కోట్లతో ఎస్సారెస్పీ కాల్వల పనులు చేపట్టి మూడు సంవత్సరాలు గడిచిందని, మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. గతంలో డబ్బులు తీసుకొని కాల్వలు ఆక్రమించిన రైతులు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దని, అవసరమైతే అధికారులు పోలీసులు సహాయం తీసుకోవాలన్నారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తే సాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి సమస్యలు పరిష్కరించి, ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్ ఈ వెంకటేశ్వర్రావు, ఈఈలు వెంకటేశ్వర్లు, సుదర్శన్, మానుకోట మార్కెట్ కమిటీ చైర్మన్ బజ్జూరి ఉమా పిచ్చిరెడ్డి, మరిపెడ ఆత్మ చైర్మన్ తోట లాలయ్య, డోర్నకల్ ఎంపీపీ డీఎస్ బాలూ నాయక్, జడ్పీటీసీ కమలారామనాథం, వైస్ ఎంపీపీ డీ నర్సయ్య, మండల అధ్యక్షుడు నున్న రమణ, ఎంపీటీసీలు భాస్కర్రావు, గణేశ్, సొసైటీ చైర్మన్లు గోవర్ధన్రెడ్డి, వెంకటరెడ్డి, కురవి ఆలయ చైర్మన్ రామూనాయక్ పాల్గొన్నారు.