రోజు 7 టన్నుల రొయ్యలు లభ్యం
జెల్ల, వాలుగలు కూడా ఎగుమతి
కంటే పెద్ద సైజులో రొయ్యలు లభ్యం
కూసుమంచి, జూన్ 15 : పాలేరులో మంగళవారం నుంచి రోయ్యల వేట ప్రారంభమైంది. తొలిరోజు రోయ్యల వేట ఆశాజనకంగా సాగింది. కొవిడ్ కారణంగా వేట కొంత ఆలస్యం కావడంతో రోయ్యలు పెద్ద సైజ్లో పెరిగాయి. ఇవి మొదటి క్వాలిటీ కిందకు రావడంతో 50 గ్రాములలోపు రోయ్యలు కేజీ రూ.130, 50 గ్రాములపైగా ఉన్న రోయ్య కేజీ రూ.220 ధర నిర్ణయించారు. గతంలో చిన్న సైజు రోయ్య మాత్రమే దొరికేవి. దీంతో తక్కువ డబ్బులు వచ్చేవి. ఈ సారి పెద్ద రోయ్యలు దొరకడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి రోయ్యలవేటకు దిగిన మత్స్యకారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు దఫాలుగా రోయ్యలు ఒడ్డుకు చేర్చారు. పట్టిన రోయ్యలను నాయకన్గూడెంలోని బీఎస్ఏ కంపెనీకి అమ్ముకున్నారు. రోయ్యలసీడ్ను బీఎస్ఏ కంపెనీ మత్స్యకారుల ద్వారా రిజర్వాయర్లో పోయించారు. చేపపిల్లలను ఉచితంగా మత్స్యకారులకు ప్రభుత్వం అందిచింది. పాలేరు రోయ్య విదేశాలకు ఎగుమతి కాగా.. జెల్ల, చిప్ప, వాలుగలు ఐస్ప్యాక్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. నాయకన్గూడెంకు చెందిన పునుగుర్తి శ్రీశైలం వలకు 7.5 కేజీలు, 8 కేజీలు రెండు వాలుగ చేపలు పడ్డాయి.
నుంచి విదేశాలకు రొయ్యలు పాలేరు రిజర్వాయర్లో తొలిరోజు సుమారుగా 7 టన్నుల రొయ్యలు వరకు దొరకడంతో వాటిని రెండు రకాలుగా గ్రేడింగ్ చేశారు. విడివిడిగా థర్మకోల్ డబ్బాల్లో ఐస్తో ప్యాక్ చేసి తరలించారు. మొదట ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలుకు తరలించి అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా విదేశాలకు తరలిస్తారు. జెల్ల, వాలుగ, చిప్పలు ప్యాక్ చేసి ఇతర ప్రాంతాలకు తరలించారు. పాలేరు రిజర్వాయర్ కింద ఉన్న 1,350 మంది వరకు మత్స్యకారులు రెండు రకాలుగా విడిపోయి రోయ్యలు, చేపల వేటకు దిగడంతో పోటాపోటీగా వేట కొనసాగించారు.