కరోనా కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మావోయిస్టులు
సమావేశంలో భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్ దత్
కొత్తగూడెం క్రైం, జూన్ 15 : కరోనా విపత్కర పరిస్థితుల్లో దండకారణ్యంలో మావోయిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటి వరకు వందల సంఖ్యలో మావోయిస్టులు వైరస్ బారినపడ్డారని భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్దత్ అన్నారు. మంగళవారం 19 మంది మిలీషియా సభ్యులు ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లో దండకారణ్యంలో మావోయిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటివరకు వందల సంఖ్యలో మావోయిస్టులు వైరస్ బారినపడ్డారని భద్రాదిర జిల్లా ఎస్పీ సునీల్దత్ అన్నారు. 19 మంది మిలీషియా సభ్యులు మంగళవారం భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్దత్ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయ ఆవరణలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. చర్ల, దుమ్ముగూడెం మండలాలకు చెందిన ముగ్గురు మహిళలు సహా19 మంది మిలీషియా, సీపీఐ మావోయిస్టు పార్టీ గ్రామకమిటీ సభ్యులు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై లొంగిపోయినట్లు తెలిపారు. వీరంతా కరోనా విపత్కర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మావోయిస్టు పార్టీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్శాఖ నిర్వహిస్తున్న ‘కమ్యూనిటీ పోలీసింగ్’ కార్యక్రమంతో ఏజెన్సీ ఆదివాసీలు చైతన్యవంతులు అవుతున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే చర్ల మండలం పులిగుండాల గ్రామానికి చెందిన 10 మంది మిలీషియా సభ్యులు, బక్కచింతలపాడుకి చెందిన ఏడుగురు సభ్యులు, దుమ్ముగూడెం మండలం ముల్కలపల్లికి చెందిన ఇద్దరు సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు ఆయన వివరించారు.
లొంగిపోయిన సభ్యుల్లో నూప ధర్మయ్య, వేల్పుల సీతారామయ్య, కనితి పుల్లయ్య, సోడి సత్యం, మల్లం రాజు, సోడి ధర్మయ్య, మీడియం కృష్ణ, పాయం రాజేష్, కనితి శ్రీరాములు, సోడి శ్రీను, పోడియం అమల, వెట్టి జ్యోతి, మడివి ఉంగి, కలుము అభిలాష్, మడకం దేవయ్య, మడివి పండు, మడకం చుక్కయ్య, మడకం దేవయ్య, మడకం ఇదమయ్య ఉన్నారు. వీరంతా రెండు, మూడేళ్లుగా మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారని, కరోనా కాలంలో ఆ పార్టీ ఎలాంటి సహకారం అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తుండడంతో వారి సిద్ధాంతాలపై అసంతృప్తి కలిగి జనజీవన స్రవంతిలో కలిసినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన మిలీషియా సభ్యులందరికీ అన్నిరకాల పరీక్షలు నిర్వహించి, వైద్య సేవలు అందించడంతోపాటు ప్రభుత్వ ప్రయోజనాలు చేకూరుస్తామని హామీ ఇచ్చారు. వందల సంఖ్యలో మావోయిస్టులు వైరస్తో ఇబ్బందులు పడుతున్నారని తమకు విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. అలాంటి వారెవరైనా సరే వెంటనే పోలీస్శాఖ ఎదుట లొంగిపోతే వైద్యసేవలు అందిచడంతోపాటు, ప్రభుత్వ ప్రోత్సహాకాలు అందేలా చేస్తామన్నారు. అనంతరం లొంగిపోయిన 19 మంది మిలీషియా సభ్యులకు ఎస్పీ సునీల్ దత్ చేతుల మీదుగా నగదు ప్రోత్సహాకాలను అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) వుప్పు తిరుపతి, 141 బెటాలియన్ సెకండ్ ఇన్ కమాండెంట్ ప్రమోద్పవార్, భద్రాచలం ఏఎస్పీ వినిత్ కుమార్, జి.చర్ల ఇన్స్పెక్టర్ బొడ్డు అశోక్కుమార్, దుమ్ముగూడెం ఇన్స్పెక్టర్ నల్లగట్ల వెంకటేశ్వర్లు, ఎస్సై శ్రీపతి తిరుపతి, పోలీస్ పీఆర్వో దాములూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.