తల్లిలాంటి పార్టీని మోసం చేసిండు
కార్యకర్తలకు మేం అండగా ఉంటాం
వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
జమ్మికుంటలో టీఆర్ఎస్ పార్టీ సమావేశం
జమ్మికుంట, జూన్ 14: ఈటల మోసకారి అని, కన్నతల్లిలాంటి పార్టీకి ద్రోహం చేశారని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ విమర్శించారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పార్టీని మోసం చేసిన వ్యక్తి ఎవరినైనా మోసం చేస్తాడని, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా మేముంటామని హామీ ఇచ్చారు. ప్రతి కార్యకర్తను కండ్లలో పెట్టుకుని చూసుకుంటామని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలిపించి మీ చేతుల్లో పెడతామని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు టీఆర్ఎస్దేనని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ స్థానం లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ నల్ల చట్టాలు తెచ్చి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నదని, కాంగ్రెస్ ఏండ్ల కాలంగా పాలించి చేసింది ఏమీ లేదని దుయ్యబ ట్టారు. కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర బంగారు తెలంగాణ దిశగా సాగుతున్నదని తెలిపారు. కేసీఆర్ వెంట మనమంతా నడవాలని, కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఐదు మండలాలున్నాయని, ఆరో మండలంగా జమ్మికుంటను తాను దత్తత తీసుకుంటానని చెప్పారు. ఏ రాత్రి ఫోన్ చేసినా పనిచేసి పెడతానని హామీ ఇచ్చారు.