విపత్తు వేళ.. సంస్థల ఆపన్నహస్తం
కరోనా బాధితులకు దాతల సాయం
ఇండ్ల వద్దకే పోషకాహారం
మంథని టౌన్, మే 14: కరోనా పాజిటివ్తో సరుకులు తెచ్చుకోలేక.. వంట చేసుకోలేక ఇబ్బం ది పడుతున్న వారికి పలు సంస్థలు, యువత మేమున్నామంటూ ఆపన్నహస్తం అందిస్తున్నా రు. కొవిడ్ బాధితుల ఇంటి వద్దకే పోషకాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ఆపద సమయంలో ఆదుకోవడంపై పలువురు వారిని అభినందిస్తున్నారు. కరోనా పాజిటివ్కు గురై ఆహారం వండుకునేందుకు ఇబ్బంది పడుతున్న మంథనిలో దాదాపు 10 కుటుంబాలకు మిత్ర బృందం సభ్యులు శుక్రవారం ఆహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మిత్ర బృందం సభ్యులు మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లో భోజనం వడ్డుకునేందుకు ఇబ్బంది పడే వారు సంప్రదిస్తే తామే వారి గడప వద్దకు వెళ్లి ఆహారాన్ని అందజేస్తామని వివరించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే వారు ముందుగానే 90101 55043, 94409 98811, 94406 44424లో సంప్రదించాలని వారు కోరారు. కార్యక్రమంలో మంథని ఎస్ఐ చంద్రకుమార్, ప్రొబేషనరీ ఎస్ఐ అజయ్, మిత్ర బృందం సభ్యులు మేడగోని వెంకటేశ్, జంబోజు సాయి, సంగినివేని నరేశ్, జెట్టి మణికుమార్, ఆకుల రమేశ్ పలువురు మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
బిర్యానీ, సేమియా ..
సుల్తానాబాద్, మే 14 : కరోనా బారిన పడి ఇబ్బందులను ఎదుర్కొంటున్న బాధితులకు జమైతే ఉలమా సంస్థ సభ్యులు అండగా నిలిచారు. రంజాన్ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు శుక్రవారం సుల్తానాబాద్లోని ఐసొలేషన్ కేంద్రంలో చికిత్స తీసుకుంటున్న 40 మంది కరో నా రోగులకు బిర్యానీతోపాటు రంజాన్ స్పెషల్ సేమియా ప్యాకెట్లను అందజేశారు. కార్యక్రమంలో జామ మసీద్ ఇమామ్ హఫీజ్ అమ్జద్, హఫీజ్ మహపూజ్, అలంగీర్ మసీద్ ఇమామ్ హఫీజ్ నాసర్, రాహీల్, నోమాన్, ఆదిల్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.
బియ్యం, కోడిగుడ్లు..
జ్యోతినగర్, మే 14: ఎన్టీపీసీ సుభాష్నగర్లోని కరోనా బాధితులకు శ్రీ ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక అధ్యక్షుడు కౌటం బాబు 50 కిలోల బియ్యం, రెండు ట్రేల కోడిగుడ్లను శుక్రవారం అందజేశారు. అలాగే తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మాతంగి మధు కూడా రెండు ట్రేల కోడిగుడ్లను పంపిణీ చేశారు. మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో నాయకులు వాజిద్ పాషా, రియాజ్ అక్బర్, ఖాజా, మంజూర్, షారూఖ్, హైమద్, సలీం, షాకీర్, రైమత్, రఫీక్, సల్మాన్, బాబా, దాసరి ఆనంద్, ఉదయ్, నాగరాజు, వేణు తదితరులు ఉన్నారు.