కురవి, అక్టోబర్ 13: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామిని బుధవారం కలెక్టర్ శశాంక దర్శించుకున్నారు. తొలిసారి ఆలయానికి వచ్చిన కలెక్టర్కు ఈవో సత్యనారాయణ, చైర్మన్ రామునాయక్, వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వయంభు అమ్మవారి ఆలయంలో, దేవీ శరన్నవరాత్రి మండపం లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈవో కార్యాలయంలో ఆలయ అభివృద్ధి పనులపై అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. ఆలయం అభివృద్ధి చెందితే కురవి గ్రామానికి అదనపు ఆదాయ వనరుగా మారుతుందన్నా రు. కల్యాణకట్ట, అతిథి గృహం, మరుగుదొడ్లు, కిరాయి గదుల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పక్షం రోజులకోసారి అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించాలని, పనుల ప్రోగ్రెస్ను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. ఆలయ అభివృద్ధికి గ్రామపంచాయతీ సహకారం అవసరమని గుర్తుచేశారు. సంక్రాంతి పండుగ వరకు పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఆలయ ప్రధాన పూజారి పారుపల్లి రామన్న, శ్రీనివాస్, అనిల్, విజయ్, పుణ్యమూర్తి, వేదపండితులు శ్రీకర్, బాలకృష్ణ, టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ గుగులోత్ రవి, కురవి ఎంపీటీసీ చిన్నం భాస్కర్, మండల కార్యదర్శి సాంబశివరావు, నర్సింహారావు, ఆలయ ధర్మకర్తలు రమేశ్, వెంకటరమణ, తహసీల్దార్ విజయ్కుమార్, ఎంపీడీవో ధన్సింగ్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ ఆలయంలో ఫ్లోరింగ్, కల్యాణకట్ట, కాలక్షేపమండ పం పనులను పరిశీలించారు.