చిన్నగూడూరు, అక్టోబర్13: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మరిపెడ మండలంలోని బాల్యతండా, ఆర్లగడ్డ తండాకు చెందిన టీఆర్ఎస్ గ్రామ, యూత్ శాఖల బా ధ్యులు బుధవారం మండలంలోని ఉగ్గంపల్లిలో ఎమ్మె ల్యే, రైస్మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా రెడ్యా మాట్లాడుతూ.. పార్టీకోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత గుర్తింపు ఉంటుందన్నారు. నాయకులు కాలూనాయక్, గ్రామ అధ్యక్షుడు బీ పాప, యూత్ అధ్యక్షుడు సురేశ్, నాయకులు వీరన్న, బాలు, రమేశ్, బాలాజీ, హరి, లచ్చు పాల్గొన్నారు.
దుర్గామాత వద్ద అన్నదానం
నర్సింహులపేట : మండలంలోని కొమ్ములవంచ గ్రామంలో దుర్గామాతా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాతా మండపం వద్ద బుధవారం సర్పంచ్ వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ జాటోత్ దేవేందర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా యువజన నాయకుడు డీఎస్ రవిచంద్ర, టేకుల యాదగిరెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు సంపెట రాము, బొబ్బ సంజీవరెడ్డి, ధర్మారపు వేణు, గుగులోత్ రవి, అనిల్, హోళీ, వంశీనాయక్, ఉపసర్పంచ్ కర్ల నాగన్న, రామన్న, సురేశ్, రమేశ్, వీరన, జంపన్న, దుర్గామాత యూత్ సభ్యులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
దంతాలపల్లి: మండలంలోని రేపోణి గ్రామానికి చెందిన సాధు వీరారెడ్డి, ఉప్పల పుల్లయ్య ఇటీవల మృతి చెందగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్ వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం దంతాలపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాయిని రఘునందన్రెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండగా ఎమ్మెల్యే అయను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట జడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన సంపెట రాము, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ వలాద్రి మల్లారెడ్డి, జిల్లా కోఅర్డినేటర్ శ్రీనివాస్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ధర్మారపు వేణు, యూత్ అధ్యక్షుడు కిశోర్కుమార్, వెంకట్రెడ్డి, సోమేశ్వర్ ఉన్నారు.