రాజీపడకుండా పని చేద్దాం lవ్యక్తులు కాదు.. పార్టీయే శాశ్వతం
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
హుజూరాబాద్ టౌన్/రూరల్, జూన్13:‘పార్టీని వదలి ఎంతో మంది వెళ్తుంటరు.. వస్తుంటరు.. కానీ, పార్టీయే శాశ్వతం. ఇది మనందరం గుర్తుంచుకోవాలి. పార్టీ ఎజెండాయే మనందరి ఎజెండా. పార్టీ పిలుపు మేరకు.. మన అభ్యర్థిని గెలిపించి తీరాలి. ఇక్కడ మళ్లీ గులాబీ జెండా ఎగురవేయాలి. ఈ బాధ్యత మనందరిపైనా ఉంది. ప్రతి ఒక్కరం రాజీపడకుండా సమన్వయంతో కష్టపడి పనిచేస్తే ఇది చాలా సులువు. పార్టీకి, ప్రజలకు అనుసంధానంగా ఉండేది కార్యకర్తలే. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, వాస్తవాలు అర్థమయ్యేలా చెప్పాలి. విజయ లక్ష్యంలో ఇప్పటికే కొంత దూరం ప్రయాణించాం. ఈ స్పీడ్ను మరింత పెంచాలి. అల్టిమేట్గా విజయం సాధించడమే మనందరి లక్ష్యం కావాలి. నాయకులు, కార్యకర్తలు అన్న తేడా ఉండదు. పార్టీ ఎవరికి ఏ బాధ్యత అప్పగించినా.. ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఈ విషయంలో విజయ తీరాలకు చేరే వరకు రాజీ పడకుండా పనిచేయాలి. మనవాళ్లెవరో.. మందివాళ్లెవరో తెలిసి పోయింది. ఇప్పుడు అందరం కలిసి పార్టీ గెలుపు కోసం పనిచేయాలి.’