కొత్తపల్లి, మే 13 : కొత్తపల్లి మున్సిపల్ పరిధిలో గురువారం కరోనా నియంత్రణ చర్యలు చేపట్టా రు. అన్ని వార్డుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించామని మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లాక్డౌన్ విధించిందన్నారు. కరోనా లక్షణాలు ఉంటే పరీక్ష చేయించుకొని మందులు వాడాలన్నారు. అలాగే, ఇంట్లో ఒకరికి పాజిటివ్ వచ్చినా మాస్క్ ధరించి ఉండాలన్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వేణుమాధవ్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.