స్వచ్ఛందంగా దుకాణాల బంద్
నిర్మానుష్యంగా రహదారులు
ఉదయం మార్కెట్లు కిటకిట
10 తర్వాత ఇంట్లోనే జనం
నిర్మల్ అర్బన్, మే 13 : జిల్లా కేంద్రంలో రెండో రోజూ గురువారం లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగింది. ఉదయం 5 నుంచే నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనుగోలు కోసం ప్రజలు మార్కెట్కు తరలివచ్చారు. దవాఖానలు, ప్రభుత్వ కార్యాలయాల్లో 33 శాతం ఉద్యోగులకు అవకాశం కల్పించడంతో విధులకు హాజరయ్యారు. బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పని చేశాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శమిచ్చాయి. రెండో రోజు 15 సర్వీసులను నడిపినట్లు డిపో మేనేజర్ ఆంజనేయులు తెలిపారు. నిజామాబాద్, ఆదిలాబాద్, భైంసా, ఖానాపూర్, మంచిర్యాల ప్రాంతాలకు సర్వీసులను నడిపారు. బస్సులు 10 గంటలోపు తిరిగి డిపోకు చేరుకున్నా యి. ప్రయాణికులు లేక బస్టాండ్ వెలవెలబోయింది.
నిర్మల్ మండలంలో..
సోన్, మే 13 : గ్రామాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారా యి. ఉదయం 10 గంటల నుంచే లాక్డౌన్ అమల్లోకి రావ డం, ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రాలేదు. మండలంలోని గంజాల్ టోల్గేట్ వద్ద, నిర్మల్-నిజామామాద్ జిల్లాల సరిహద్దు చెక్పోస్ట్ వద్ద వాహ నాల రద్దీ లేక వెలవెలబోయాయి. గంజాల్ టోల్ప్లాజా వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
భైంసాలో..
భైంసా, మే 13 : ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని కార్యకలాపాలు కొనసాగాయి. అనంతరం స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి ప్రజలు లాక్డౌన్కు సహకరించారు.
కుభీర్లో..
కుభీర్, మే 13 : మండల కేంద్రంతో పాటు నిగ్వ, పల్సి, పార్డి(బీ), మాలేగాం, చాత, పార్డి(కే) తదితర గ్రామాల్లో రెం డో రోజు లాక్డౌన్ కొనసాగింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు దుకాణాల వద్ద సందడి కనిపించింది. 10 తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. తెలంగాణ చౌక్, వివేకానంద చౌక్, అన్నబావు సాఠే కూడళ్లు బోసి పోయాయి.
కుంటాలలో..
కుంటాల, మే, 13 : ఉదయం 6 నుంచి 10 గంటల వర కు కూరగాయలు, కిరాణా దుకాణాలు జనంతో రద్దీగా కనిపించాయి. చౌకధరల దుకాణాల వద్ద ఉదయం నుంచే ఖాళీ సంచులను క్యూలో పెట్టి కార్డుదారులు సరుకులు పొందారు. పెట్రోల్, డీజిల్ కోసం బంక్ వద్ద వాహనదారులు బారులు తీరారు. ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు అన్ని గ్రామా ల్లో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు.
దస్తురాబాద్లో..
దస్తురాబాద్, మే 13 : మండలంలో సంపూర్ణంగా లాక్డౌన్ కొసాగింది. అత్యవసర పరిస్థితిలో తప్ప మండల ప్రజ లు బయటకు రాలేదు. ఉదయం 6 నుంచి 10 గంటలకు వరకు అన్ని రకాల దుకాణాలు తెరిచి ఉన్నాయి. అత్యవసరాల సేవలు మాత్రమే పని చేశాయి. మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
ముథోల్లో..
ముథోల్, మే, 13 : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ప్రధాన కూడళ్లు, రహదారులు నిర్మానుష్యంగా మారాయి. నిత్యావసర సరుకుల కొనుగోలుకు ఉదయం 10 గంటల వరకు అనుమతించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అశోక్ తెలిపారు.