నిర్మల్ జిల్లాలో 400 మంది పోలీసులతో విధులు
హారాష్ట్ర సరిహద్దులో నిఘా
తొలిరోజు 128 కేసులు నమోదు
ఇంట్లోనే పండుగలు నిర్వహించుకోవాలి : ఇన్చార్జి ఎస్పీ
నిర్మల్ అర్బన్, మే 13 : లాక్డౌన్ను జిల్లాలో పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతంలో ఉన్న ప్రదేశాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘాను పటిష్టం చేశారు. జిల్లాకు మూడు చోట్ల మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఉండడంతో బెల్తరోడ, బాసర, సారంగపూర్ మండలాల పరిధిలో 24 గంటల పాటు నిఘాను పటిష్టం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తొలిరోజు లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించిన 128 మందిపై పోలీసులు కేసులను నమోదు చేశారు.
విధుల్లో 400 మంది పోలీసులు
లాక్డౌన్ను పక్కాగా అమలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 400 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. 12 గంటలకు ఒక షిఫ్టు చొప్పున రెండు షిఫ్టుల్లో పోలీసులకు విధులు కేటాయించారు. జిల్లాకు మూడు చోట్ల మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఉండండతో నిత్యం ఎస్పీ, డీఎస్పీలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
లాక్డౌన్ రూల్స్ ప్రచారం
లాక్డౌన్ నిబంధనలు ప్రజలందరికీ తెలిసేలా పోలీసులు జిల్లాలో ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ ప్రచార రథం జిలా వ్యాప్తంగా తిరుగుతూ నిబంధనలు ప్రజలకు వివరిస్తున్నది.
128 కేసులు నమోదు
జిల్లాలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం నిబంధనలు ఉల్లంఘించిన 128 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో భౌతిక దూరం పాటించనివి -2, క్రాఫ్ వాయిలెంట్ -56, నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరిగిన 70 వాహనాలపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వం సడలింపు ఇచ్చిన వారు బయటకు వెళ్తే కచ్చితంగా తమ గుర్తింపు కార్డులను చూపించాలని, లేనిచో కేసులు నమోదు చేస్తామని పోలీసులు సూచిస్తున్నారు.