కొవిడ్ నేపథ్యంలో ఇళ్లలోనే పూజలు
నమస్తే తెలంగాణ నెట్వర్క్: జిల్లాలోని అన్ని గ్రామాల్లో మంగళవారం ఉగాది వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ప్లవనామ తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా ఆలయాల్లో పూజలు చేశారు. పంచాంగం వినిపించారు. నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం గ్రామంలో ఎంపీపీ టేకుల సుశీల టీఆర్ఎస్ నాయకుడు యాదగిరెడ్డి దంపతులు ఉగాది పచ్చడిని ప్రజలకు పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని వేంకటేశ్వర, రాజరాజేశ్వరి ఆలయాల్లో అర్చకులు పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నందనచార్యులు, నర్సింహచార్యులు పూజలు చేశారు. సాయత్రం రాజరాజేశ్వరి ఆలయంలో దేవేంద్రచార్యులు పంచాంగం చదివి వినిపించారు. రైతులు పొలాల్లో పశువుల పేడను చల్లి పంటలు బాగా పండాలని దేవుళ్లకు మొక్కుకున్నారు. నెల్లికుదురు మండలంలోని వివిధ గ్రామాల్లో ఇంటివద్దే పూజలు చేసి షండ్రుచులతో ఉగాది పచ్చడి చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి తాగారు. జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పాల్గొన్నారు. కురవి మండలంలోని అన్ని గ్రామాల్లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. షడ్రుచులతో చేసిన పచ్చడిని సేవించారు. కురవిలోని వీరభద్రస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సాయంత్రం ఆనవాయితీ ప్రకారం ఆలయ అధికారులు పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన పూజారి పారుపెల్లి రామన్న, రెడ్యాల శ్రీనివాస్ పంచాంగాన్ని చదివి వినిపించారు. ఆలయ చైర్మన్ రామునాయక్, ఎంపీటీసీ చిన్నం భాస్కర్, ధర్మకర్త మేక నాగిరెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ రాజునాయక్, టీఆర్ఎస్ నాయకులు నర్సింహారావు, తుకారాంనాయక్, ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ పాల్గొన్నారు. పెద్దవంగరలో పెద్దన్నశర్మ పంచాంగం వినిపించారు. వేడుకల్లో పాలకుర్తి ఆలయ చైర్మన్ రామచంద్రయ్యశర్మ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు సుధీర్, లింగమూర్తి, రాము, రవి, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. గూడూరులో లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో పూజారి గోవర్ధనగిరి వరదాచార్యులు పంచాగం వినిపించారు. శివాలయంలో పూజారులు పంచాగం వినింపించారు. సర్పంచ్ రమేశ్నాయక్, నాయకులు శ్రీనివాస్, వేణు, నరేశ్గౌడ్, జనార్దనస్వామి, ఉప్పలయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు. దంతాలపల్లి, చిన్నగూడూరు, మరిపెడ, గంగారం, డోర్నకల్, కేసముద్రం తదితర మండలాల్లో ఉగాది పండుగను నిర్వహించారు.