జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి
పెద్దపల్లి రూరల్, జూలై 12: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి సూచించారు. పెద్దపల్లి మం డలం అందుగులపల్లి, అప్పన్నపేట, బొంపల్లిలో సోమవారం ఆయన పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో పల్లెప్రగతి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి, ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. కార్యక్రమంలో డీఎల్పీవో దేవకీదేవి, ఎంపీవో సుదర్శన్, పంచాయతీ రాజ్ ఏఈ పటేల్ మదన్మోహన్రెడ్డి, సర్పంచులు కారె శారద, చీకటి స్వరూప, పోచాలు, అరికిల్ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.