రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోదావరిఖని, మే 12:మంత్రి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆర్జీ-1 మేడిపల్లి ఓసీపీ-4లో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. సంఘం యాక్టింగ్ పిట్ సెక్రటరీ ఎడవెల్లి రాజిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ప్రాజెక్టు ఆవరణలోని దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్, ఏలేశ్వరం సత్యనారాయణ, జనగామ శ్రీనివాస్, నేరెళ్ల సదయ్య, పొలాడి శ్రీనివాస్, ఉదయ్ భాను, శ్రీనివాస్, రాములు, జంపయ్య, ఖాసీం, చందు తదితరులు ఉన్నారు.
కోల్సిటీ, మే 12: మంత్రి దంపతులు త్వరగా కోలుకోవాలని రామగుండం కార్పొరేటర్లు అమ్మవారిని వేడుకున్నారు. ఈ మేరకు గోదావరిఖని జవహర్నగర్లోని శ్రీ జయ దుర్గాదేవి ఆలయంలో 5, 12, 13, 32, 33 డివిజన్ల కార్పొరేటర్లు ప్రత్యేక పూజలు చేశారు. కొప్పుల దంపతుల ఇష్ట దైవమైన దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులతో కోలుకొని తిరిగి ప్రజల మధ్యకు వచ్చి వారి సేవలను కొనసాగించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రాకం లత దామోదర్, రజిత రవీందర్, కృష్ణవేణి, ఐత శివకుమార్, శ్రీనివాస్, నాయకులు తోడేటి శంకర్ గౌడ్, మెతుకు దేవరాజ్, శ్రీహరి, అనుముల కళావతి, కరాటే మొండయ్య ఉన్నారు.
రామగిరి, మే 12 : మంత్రి దంపతుల తోపాటు కుటుంబ సభ్యులు కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆర్జీ -3 టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఓసీపీ -2 ఆవరణలోని మైసమ్మ ఆలయంలో టీబీజీకేఎస్ ఆర్జీ -3 ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య, సెంటినరీకాలనీలో ఎస్అండ్పీసీ సిబ్బంది త్రయంబకేశ్వర ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమాల్లో ఈసంపల్లి రమేశ్, పొన్నం సదయ్య, ఓదన్న, రామయ్య, జనగామ శ్రీనివాస్ ముజాఫర్ ఆలీ, దాసరి మల్లేశ్, వేముల రవిశంకర్, జయపాల్రెడ్డి, జిటుకు శ్రీనివాస్, కొలిపాక మురళి, జక్కుల దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
యైటింక్లయిన్ కాలనీ, మే 12: మంత్రి దంపతులు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆర్జీ-2లోని అన్ని గనులపై ఉన్న మైసమ్మ ఆలయాల్లో పూజలు చేశారు. కార్యక్రమాల్లో ఐలి శ్రీనివాస్, సత్యనారాయణ, శంకర్ నాయక్, కృష్ణ, సత్యం, శ్రీనివాస్ రెడ్డి, బానాకర్, హరిప్రసాద్, చంద్రయ్య, ప్యారేమియా, లచ్చయ్య, రవీందర్ రెడ్డి, రాజేశం, సురేందర్, మల్లేశ్వరరావు, చంద్రమౌళి తదితరులు ఉన్నారు.