ధారూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే ఆనంద్
ధారూరు, అక్టోబర్ 11: వ్యవసాయ మార్కెట్లను మరింత బలోపేతం చేయడానికి ప్రభు త్వం కృషి చేస్తున్నదని, పాలక వర్గ సభ్యులు బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం ధారూరు మండల కేం ద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ధారూరు మం డల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీ కారోత్సవ కార్యక్రమంలో ప్రజా ప్రతి నిధులతో కలిసి పాల్గొన్నారు. అంతకు ముందు మండల పరిధిలోని హరిదాస్పల్లి గేట్ నుంచి ఫంక్షన్ హాల్ వరకు భారీ జనసందోహంతో భైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ధారూరు మండల వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా సంతోష్కుమార్, వైస్ చైర్మన్గా అంజయ్య, పాలక వర్గ సభ్యులను మార్కెట్ కార్యదర్శి ప్రమాణ శ్రీకారం చేయించారు. మండల నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్కుమార్, వైస్ చైర్మన్ అంజయ్యలను శాలువ, పూల మాలలతో ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ పారదర్శకత, రైతుల ప్ర యోజనమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తమ పరిధిలో గల రైతులకు ఉత్పత్తులను మార్కెట్ కమిటీ యార్డులోనే అమ్మేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. తూకం సమయంలో అవకతవకలు జరగకుండా మార్కెట్ యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. కార్యక్రమంలో ధారూరు ఎంపీపీ జైదుపల్లి విజయలక్ష్మి, జడ్పీటీసి కోస్నం సుజాత, వైస్ ఎంపీపీ విజయ్కుమార్, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ రాజునాయక్, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ హన్మంత్ రెడ్డి, హరిదాస్పల్లి పీఏసీఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ కృష్ణ, మండల కో-అప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, సర్పంచ్ చంద్రమౌళి, ఉపసర్పంచ్ రాజేశ్వర్, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వీరేశం, ఎంపీటీసీల సంఘం మం డల అధ్యక్షుడు బసప్ప, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శులు కావలి అంజయ్య, రాములు, యువజన విభాగం మండల అధ్యక్షుడు జైపాల్రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు యాదయ్య, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు దేవేందర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నర్సింహులు, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు మహమ్మద్ ఇస్మాయిల్ పాల్గొన్నారు.
పలువురు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ
గ్రామీణ ప్రాంత ప్రజలు మధ్యవర్తులను నమ్మి మోస పోవద్దని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. సోమవారం ధారూరు మండల కేంద్రంలోని శ్రీ శక్తి భవనంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ధారూరు ప్రజా ప్రతి నిధులు, నాయకులతో కలిసి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.