మున్సిపల్ ప్రగతికి కృషి
ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి
రూ. 64 లక్షలతో రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
సుల్తానాబాద్, జూన్ 11: ఎన్ని సంక్షోభాలు ఎదురైనా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆలోచన విధానంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుంచి మం జూరైన రూ. 64.50లక్షలతో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడిన సుల్తానాబాద్ మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం, మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చైర్పర్సన్ ముత్యం సునీతరమేశ్ మాట్లాడుతూ, పట్టణంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయ ని వివరించారు. ఇక్కడ ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, ఏఎంసీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కమిషనర్ మట్ట శ్రీనివాస్రెడ్డి, నాయకులు, కౌన్సిలర్లు, ముత్యం రమేశ్గౌడ్, గుర్రాల శ్రీనివాస్, రేవెల్లి తిరుపతి, ఉట్ల వరప్రదీప్, దున్నపోతుల రాజ య్య, పసెడ్ల మమత సంపత్, చింతల సునీతరాజు, రఫిక్, సాజిద్, కలీం, బండ అంజయ్య, బండ తిరుపతి తదితరులు ఉన్నారు.