జిల్లావ్యాప్తంగా 188 కేంద్రాల్లో 51177.750 మెట్రిక్టన్నుల ధాన్యం సేకరణ
కలెక్టర్ వెంకట్రావు
మూసాపేట, మే 11 : ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత వ్య వసాయ భూముల రిజిస్ట్రేషన్లు త్వరితగతిన అవుతున్నాయని కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. మంగళవారం కలెక్టర్ మూసాపేట తాసిల్దార్ కార్యాలయాన్ని, ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కార్యాలయంలో మొదట ధరణి రిజిస్ట్రేషన్లు ఎలా సాగుతున్నాయి.. రోజుకు ఎన్ని చేస్తున్నారు.. పెండింగ్లో ఏమైనా ఉన్నాయా.. ఏమైనా సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయా అని తాసిల్దార్ మంజులతో ఆరా తీశారు. ఆమె స్పందిస్తూ ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు రోజుకు ఒకటి, రెండు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. మూసాపేట ఆదర్శ మండల మహిళా సమాఖ్యలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం కొమిరెడ్డిపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం సేకరణ ఏవిధంగా సాగుతుందని ఏవో రాజేందర్రెడ్డితో ఆరా తీశారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీ సుకురావాలని ఏవో, తాసిల్దార్ను ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లాలోని 188 కేంద్రాల్లో 8722మంది రైతులు నుంచి 51177.750 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ మానస, రా మరాజు, రాంబాబు, ఏపీఎం విష్ణుచారి పాల్గొన్నారు.