గోదావరిఖని, మే 11: సింగరేణి వ్యాప్తంగా ఎక్స్ప్లోజివ్ సరఫరా, ఓబీ తొలగిం పునకు సంబంధించి విషయాలపై అన్ని ఏరియాల జీఎంలతో సింగరేణి డైరెక్టర్లు బలరాం, సూర్యనారాయణ చర్చించారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ దారా సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణిలో ఉపరితల, భూగర్భ గనులకు ఎక్స్ప్లోజివ్ సరఫరా, వినియోగంపై చర్చించారు. ఎక్స్ప్లోజివ్ సరఫరా పెంచాలని, అందుకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి, ఓబీ తొలగింపు పెరుగుతుందని వివరించారు. ఓబీ తొలగింపు పనులపై చర్చించారు. మేడిపల్లి ఓసీపీలో నిర్దేశించిన లక్ష్యాలకు మించి ఓబీ తీస్తున్నారని, ఇలాగే కొనసాగించాలని సూచించారు. ఓబీ తొలగింపుపైనే బొగ్గు ఉత్పత్తి ఆధారపడి ఉంటుందన్నారు. జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్జీ-1 జీఎం నారాయణ, ఎస్వోటూ జీఎం త్యాగరాజు, మేడిపల్లి పీవో సత్యనారాయణ, ఏజెంట్లు చిలుక శ్రీనివాస్, శ్రీనాథ్, గోవిందరావు తదితరులు ఉన్నారు.
ఆర్జీ -3 డివిజన్లోని ఓసీపీ -1, 2ల్లో ఓబీ వెలికితీత, ఎక్స్ప్లోజివ్ వినియోగం, బొగ్గు ఉత్పత్తిపై డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పీపీ ఎన్ బలరాం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఓసీపీల్లో నిర్దేశించిన ఓబీ వెలికితీయాలని అధికారులకు సూచించారు. వీసీలో జీఎం మనోహర్, జీఎం ఎక్స్ప్లోజివ్ అండ్ బ్లాస్టింగ్ ఎన్. వెంకటేశ్వర్రావు, ఓసీపీ -1,2 ప్రాజెక్ట్ అధికారులు రఘుకుమార్, మచ్చగిరి నరేందర్, మేనేజర్లు ఉదయ్ హరిజన్, కేవీ రామారావు పాల్గొన్నారు.
యైటింక్లయిన్ కాలనీ, మే 11: ఆర్జీ-2 పరిధిలోని ఓసీపీ-3లో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతపై ఆర్జీ-2 జీఎం టీ వెంకటేశ్వరరావు సమీక్షించారు. ఈ మేరకు ఓసీపీ-3 అధికారులతో ఆయన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలు, వార్షిక లక్ష్యాలు సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, యంత్రాల పూర్తి వినియో గం, నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి, రవాణా, వ్యయం తగ్గింపు, కరోనా నియంత్రణకు తీసుకుంటున్న జాగ్రత్తలు, ఉద్యోగులకు వ్యాక్సినేషన్ విషయాలపై అధికారులతో చర్చించారు. లక్ష్యాలను చేరుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం సాంబయ్య, ఇంజినీర్ దుర్గాప్రసాద్, డీజీఎం మురళీకృష్ణ, ఎర్రన్న, సృజన్, నర్సింగరావు, రాందాస్ ఉన్నారు.