ఎమ్మెల్యే విద్యాసాగర్రావు
ఉచిత రేషన్ బియ్యం ప్రారంభం
సీఎంఆర్ఎఫ్,కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
కోరుట్ల రూరల్, జూన్ 10 : ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. గురువారం మండలంలోని గుంలాపూర్ గ్రామ శివారులోని గుట్టపై గల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ రహదారికి సీసీ రోడ్డు నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతా ల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. ప్రతి గ్రామంలో వీధులు సీసీరోడ్లు మురికి కాలువల నిర్మాణాలను చేపడుతున్నామన్నారు. పల్లె ప్రకృతి వనంలో గ్రామీణ ప్రాంతాల్లో యేళ్ల నుంచి ఉన్న సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నా రు. రైతుల ఆర్థికాభివృద్ది కోసం సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, పెట్టుబడి, నిరంతర వి ద్యుత్ను అందిస్తూ ఏ రాష్ట్రంలో లేని విధంగా అ మలు చేస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు.
అలాగే ప్రభు త్వం ఉచితంగా అందజేసే రేషన్ బియాన్ని ప్రా రంభించి, నిరుపేదలకు కోసం ఉచితంగా ప్రతి ఒక్కరికి 15కిలోల బియ్యాన్ని అందించడం జరుగుతుందన్నారు. కాగా గ్రామంలోని పలు కులసంఘాల భవన నిర్మాణాలకు నిధుల మంజూరకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యేను సర్పంచ్, ప్రజాప్రతినిధులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట నారాయణ, జి ల్లా రైతు బంధు అధ్యక్షుడు చీటి వెంకట్రావ్, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, సర్పంచులు యాదగిరి అమ్మాయి, వనతడుపుల అంజయ్య, శివరాత్రి రాజరెడ్డి, సహకార సంఘం అధ్యక్షులు సింగిరెడ్డి న ర్సారెడ్డి, బండి భూమ య్య, కార్గోరు నర్సయ్య, నాయకులు యాదగిరి శ్రీనివాస్రావు, అశోక్రా వు, గంగనర్సయ్య, పిడు గు సందయ్య, గుగ్గిల్ల సురేశ్గౌడ్, కట్కం రాజేశ్, మార్గం ప్రతాప్, రాజేశంగౌడ్, నూత్పెల్లి ముత్త య్య, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్, కల్యాణ లక్ష్మీ చెక్కుల అందజేత
కోరుట్ల, జూన్ 10: కరోనా సంక్షోభంలోను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథ కాలను పక్కాగా అమలు చేస్తూ పేద ప్రజలకు అం డగా నిలిస్తున్నారని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్రావు పేర్కొన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం పట్టణ, పరిసర గ్రామాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్ పథకాల ద్వారా 40 మంది లబ్ధిదా రులకు మంజూరైన రూ. 40,04,640 విలువైన చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా 44 మందికి మంజూరైన రూ. 17 లక్షల 25 వేల 500 విలువైన చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అలాగే నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఇటీవల గెలుపొందిన నోముల భగత్ కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో విద్యాసా గర్రావును మార్యదపూర్వకంగా కలిసి ఆశీర్వా దం తీసుకున్నారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే వి ద్యాసాగర్రావు భగత్ను శాలువా, పూలమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమం లో ఆర్డీవో వినోద్కుమార్, మున్సిపల్ అధ్యక్షురా లు అన్నం లావణ్య, ఉపాధ్యక్షుడు గడ్డమీది పవ న్, ఆర్బీఎస్ అధ్యక్షుడు చీటి వెంకటరావు, టీఆర్ ఎస్ పట్టణా ధ్యక్షుడు అన్నం అనిల్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, ఎంపీపీ తోట నారా యణ, తహసీల్దార్ సత్యనారాయణ, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.