సామాజిక బాధ్యత.. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా దుకాణాల సెల్ఫ్ లాక్డౌన్
కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వ చేపడు తున్న చర్యలకు మద్దతుగా వ్యాపారులు, ప్రజలు సెల్ఫ్ లాక్డౌన్ విధించుకుంటున్నారు. సామాజిక బాధ్యతగా దుకాణాదారులు తమ వ్యాపార సమయాన్ని కుదించుకుంటున్నారు. కీలక సమయంలో మంచి నిర్ణయాన్ని తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జూలపల్లిలో పొడిగింపు
జూలపల్లి, మే 10: మండల కేంద్రంలో పాక్షి క లాక్డౌన్ను ఈ నెల 30వ తేదీ దాకా పొడిగిస్తున్నట్లు పంచాయతీ పాలక వర్గం సభ్యులు ప్రకటించారు. కరోనా వైరస్ కట్టడికి ఇంతక్రితం 14 రోజులు స్వచ్ఛందంగా లాక్డౌన్ కొనసాగించారు. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వా త వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు యథావిధిగా మూసి వేయాలని సూచించారు. గ్రామపంచాయతీ నిబంధనలు అతిక్రమిస్తే రూ. 2 వేల వరకు జరిమాన విధిస్తామని హెచ్చరించారు. ఇటీవల కరోనా సోకి మండల కేంద్రంలో ఇద్దరు మృతి చెందడంతో మరోసారి లాక్డౌన్ అమలు చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. వ్యాపారులు, గ్రామస్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
బేగంపేటలో ..
రామగిరి, మే 10 : బేగంపేటలో పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండడంతో అక్కడి వ్యాపారులు, గ్రామస్తులు రెండు రోజులుగా స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఒంటి గం ట దాకా దుకాణాలు తెరిచి ఉంటాయని వ్యాపారులు తెలిపారు. వినియోగదారులు తమకు సహకరించాలని కోరారు. సర్పంచ్ బుర్ర పద్మ ఆధ్వర్యంలో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టి, హైపోక్లోరైట్ పిచికారీ చేయించారు.
రామగుండంలో ..
జ్యోతినగర్(రామగుండం), మే 10: రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాలోని దుకాణాదారులు సెల్ఫ్ లాక్డౌన్ను ప్రకటించారు. ఈ నెల 10 నుంచి 30వ తేదీ దాకా మధ్యాహ్నం 2 గం టల నుంచి దుకాణాలు మూసివేయనున్నట్లు తెలిపారు. 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీశ్కుమార్ ఆధ్వర్యంలో దుకాణాలు మూసివేసి వ్యాపారులు సమావేశమయ్యారు. కరోనా కట్టడి కోసం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు సహకరించాలని కోరారు. సామాజిక బాధ్యతతో సెల్ఫ్ లాక్డౌన్ నిర్ణయం మంచి పరిణామం అని కార్పొరేటర్ వ్యాపారులను అభినందించా రు. ఇక్కడ కిరాణా, హోటల్స్, పాన్షాప్ యజమానులతోపాటు అన్ని రకాల చిరు వ్యాపారులు కే మల్లేశ్, టీ శంకర్, కే శ్యాంసుందర్, ఆర్ శశిధర్, శివ ప్రసాద్, మోహిజ్ గౌస్, రసూల్, సర్వర్ తదితరులు ఉన్నారు.