లక్షెట్టిపేట రూరల్, మే 10 : పట్టణాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాల య ఆవరణలో 12 స్వచ్ఛ ఆటోలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కరో నా సెకెండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో సమస్యల పరిష్కారానికి, కరోనా కట్టడి కి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రగతి ద్వారా తడి,పొడి చెత్త సేకరణకు డీఎంఎఫ్టీ నిధులు రూ. 72 లక్షలతో 12 స్వచ్ఛ ఆటోలు కొనుగోలు చేశామన్నారు. అదేవిధంగా రూ. 5.92 లక్షలతో చెత్తబుట్టలు కొనుగోలు చేశామని, త్వరలోనే ఇంటింటికీ పంపిణీ చేస్తామన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ. కోటి, లక్షా తొంబై రెండు వేలతో అంతర్గత రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. పారిశుధ్య కార్మికులకు రూ. 12 వేల జీతం పెంచిన ఘనత టీఆర్ఎస్ సర్కారుదేనన్నారు. కరోనా బాధితులను తీసుకెళ్లే అంబులెన్సు డ్రైవర్లు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, తమ దృష్టికి వచ్చిందని, ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బెల్లంపల్లి ఐసొలేషన్ కేంద్రంలో బెడ్లు ఖాళీగా ఉన్నాయని, ఆక్సిజన్ కొరత మన దగ్గర లేదని స్పష్టం చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సరిపడా వ్యాక్సిన్లను సరఫరా చేయడం లేదన్నారు. కాలేజీ గ్రౌండ్లో నిర్మిస్తున్న స్టేడియంలోని షాపింగ్ కాంప్లెక్స్లో గతంలో టేలాలు కోల్పోయిన వారి కి కేటాయిస్తామని, ఇందుకు మున్సిపల్ ఆమోదించిన సాధారణ రుసుం చెల్లించాలని సూచించారు. పట్టణంలో సమీకృత సంత (ఇంటిగ్రేటెడ్ మార్కెట్)ను కూడా నిర్మిస్తామన్నారు. అం తేగాకుండా ఓపెన్ జిమ్లను కూడా త్వరలోనే ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అంతకు ముందు మున్సిపల్ ఆధ్వర్యంలోని నర్సరీని ఆయన పరిశీలించారు. కా ర్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, వైస్ చైర్మ న్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కేతిరెడ్డి సంధ్యారాణి, జగన్ మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు చాతరాజు రాజన్న, ఓరగంటి శ్రీకాంత్, లావుఢ్యా సురేశ్ నాయక్, చింత అశోక్, కో ఆప్షన్ సభ్యులు, పారిశుధ్య కార్మికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.