మంత్రి సందర్శించిన నెల రోజుల్లోనే నిర్ణయం
వంద బెడ్లతో ఆసుపత్రి మంజూరు హర్షణీయం
మధిర ప్రజలు సంతోషిస్తున్నారు: జడ్పీ చైర్మన్
ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
బోనకల్లు, జూన్ 9: దశాబ్దాల నాటి మధిర ప్రభుత్వ ఆసుపత్రికి సీఎం కేసీఆర్ మోక్షం కల్పించారని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. మధిర ప్రభుత్వ ఆసుపత్రిని వంద బెడ్ల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం, 50 బెడ్లతో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంజూరు చేయడంపై మధిర నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు బుధవారం మధిర సీహెచ్సీ వద్ద కేసీఆర్ చిత్రపటానికి జడ్పీ చైర్మన్ కమల్రాజు, మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, ఎంపీపీ మెండెం లలిత క్షీరాభిషేకం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ మధిర ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వంలో చీఫ్ విప్గా, డిప్యూటీ స్పీకర్గా పదవులను అనుభవించిన భట్టివిక్రమార్క.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇటీవల మంత్రి అజయ్ ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటు కోసం వచ్చినప్పుడు.. ఈ ఆసుపత్రికి అభివృద్ధికి నోచుకోలేదంటూ భట్టి విడ్డూరంగా మాట్లాడారన్నారు. అప్పుడు మంత్రి స్పందిస్తూ.. మీ పాలలోని సమస్యలన్నింటినీ తమకు అప్పగించారని, వాటన్నింటినీ పరిష్కరించుకుంటూ వస్తున్నామని భట్టికి కనువిప్పు కలుగజేశారని గుర్తుచేశారు. తరువాత నెల రోజుల్లోనే మంత్రి అజయ్ మధిరకు వంద బెడ్ల ఆసుపత్రిని మంజూరు చేయించారని అన్నారు. ఏఎంసీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ చావా వేణు, టీఆర్ఎస్ నేతలు దేవిశెట్టి రంగారావు, రావూరి శ్రీనివాసరావు, అరిగె శ్రీనివాసరావు, బొ గ్గుల భాస్కర్రెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.