మణుగూరు, జూన్ 9: ముణుగూరు మున్సిపాలిటీ అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. రూ.15 లక్షలతో మణుగూరు పట్టణంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా చేపట్టిన డ్రైనేజీ క్లీనింగ్ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వర్షాలు రాకముందే కాలువల్లోని పూడికను తీయాలని, అధికారులకు సూచించారు. పట్టణ ప్రజలు, వ్యాపారులు కూడా పనుల నిర్వహణకు సహకరించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ పీ.నాగప్రసాద్. జడ్పీటీసీ పోశం నర్సింహారావు, మున్సిపల్ ఏఈ సత్య, టీపీవో భాస్కర్రావు, టీఆర్ఎస్ నాయకులు అడపా అప్పారావు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్ పాల్గొన్నారు.