వన్యప్రాణుల దాహం తీర్చేందుకు అడవుల్లో నీటి కుంటలు
ట్యాంకర్ల ద్వారా నీటి తరలింపు
నిత్యం అధికారుల పర్యవేక్షణ
రుద్రంగి, మే 9: వేసవిలో వన్యప్రాణుల దాహం తీర్చేందుకు అటవీశాఖ అధికారుల నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. వేసవిలో వన్య ప్రాణులు నీటి కోసం సమీప గ్రామాల్లోకి రావ డం, రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడం వంటి సంఘటనలకు చెక్ పెట్టేందుకు అడవిలోనే నీటి నిల్వలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నా రు. అడవుల్లో నీటి కుంటలు నిర్మించి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. ఈ కుంటలు భూగర్భ జలాలను పెంచడంతోపాటు జీవాల దాహం తీరుస్తున్నాయి.
అటవీ శాఖ ప్రత్యేక చర్యలు
ఎండలు క్రమంగా ముదురుతున్నాయి. అడవుల్లో నీటి కటకట మొదలైంది. ఇప్పటికే అడవుల్లో నీటి కుంటలు, వాగులు, వంకలు ఎండిపోయాయి. వన్యప్రాణుల దాహం తీర్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నాయి. ఈ క్రమంలో వాటి దా హం తీర్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా..
గతంతో పోలిస్తే వన్యప్రాణుల సంఖ్య పెరిగిం ది. అందుకు తగ్గట్టుగానే ముందస్తు ప్రణాళికలు రూపొందించి వన్యప్రాణులకు ఇబ్బందులు తలెత్తకుండా అటవీశాఖ అధికారులు చూస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో సిబ్బంది ఎప్పటికప్పుడు నీటి కుంటలు, తొట్టిల్లో నీటిని నిల్వ చేస్తున్నారు. తొట్టిలను శుభ్రం చేస్తూ ట్యాంకర్ ద్వారా నీటిని నింపుతున్నారు.
నిత్యం పరిశీలిస్తున్నాం
వేసవిలో వన్యప్రాణులకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎండలు ముదురుతుండడంతో జంతువుల దాహం తీర్చేందుకు నీటి గుంతలు ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు తొట్టిలను శుభ్రం చేస్తూ ట్యాంకర్ ద్వారా నీటిని నింపుతున్నాం. దీంతో జంతువులకు పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నది.