వైరా, ఏప్రిల్ 9 : కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని ఏసీపీ కె.సత్యనారాయణ అన్నారు. మధిర క్రాస్ రోడ్డులో ప్రజలకు కరోనా వైరస్పై పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు మాస్క్లు పంపిణీ చేసి మాట్లాడారు. మాస్క్లు ధరించకపోతే జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తామన్నారు. సీఐ జె.వసంతకుమార్, ఏఎస్సై బాబురావు, కానిస్టేబుల్ దయానంద్ పాల్గొన్నారు.
సత్తుపల్లి రూరల్, ఏప్రిల్ 9 : ప్రస్తుతం కరోనా రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరికీ మాస్క్ తప్పని సరిగా పెట్టుకోవాలని, అర్హులైన వారు వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యాధికారి చింతా కిరణ్కుమార్ అన్నారు. మండల పరిధిలోని గంగారం పీహెచ్సీలో శుక్రవారం ఆయన కొవిడ్ వ్యాక్సిన్పై అవగాహన కల్పించి మాట్లాడుతూ45 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీహెచ్వో కృష్ణవేణి, శ్రీనివాసరావు, ఏఎన్ఎం, ఆశాలు, సిబ్బంది పాల్గొన్నారు.
కల్లూరు, ఏప్రిల్ 9 : ప్రస్తుత తరుణంలో కరోనా వైరస్ పొంచి ఉందని జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రజలు బయటకు వస్తే ఖచ్చితంగా మాస్క్ ధరించడమే కాక భౌతికదూరం పాటించాలన్నారు. 45 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సిన్ వేయించుకోవాలని పేర్కొన్నారు.
కామేపల్లి, ఏప్రిల్ 9 : కరోనా వ్యాక్సిన్ పట్ల ఎలాంటి అపోహలు వద్దని తహసీల్దార్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలన్నారు. ప్రసుత్తం ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని,మాస్క్ ధరించని వారికి జరిమానా విధిస్తామన్నారు.
కారేపల్లి,ఏప్రిల్ 9 : పీహెచ్సీ కేంద్రంలో శుక్రవారం 56 మందికి కొవిడ్ టీకాలు వేసినట్లు మండల వైద్యాధికారి యాసా హన్మంతరావు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగాఉండాలని,ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు.
ఏన్కూరు, ఏప్రిల్ 9 : కరోనా నివారణ వ్యాక్సిన్ను 45 ఏండ్లు నిండిన వారంతా తప్పని సరిగా వేయించుకోవాలని వైద్యుడు అల్తాఫ్ కోరారు. పీహెచ్సీలో విలేకరులతో మాట్లాడుతూ పుకార్లు, అపోహలకు లోను కావద్దన్నారు. మాస్క్, శానిటైజర్ ఉపయోగించాలని సూచించారు.
తల్లాడ, ఏప్రిల్ 9: మండలంలో 45 సంవత్సరాలు నిండిన ప్రజాప్రతినిధులు, మల్టీపర్పస్ వర్కర్లు, మండల కార్యాలయ సిబ్బంది, గ్రామ పంచాయతీ సెక్రటరీలు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంపీడీవో రవీందర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు పీహెచ్సీలో కొవిడ్ వ్యాక్సిన్ వేస్తారన్నారు.