కమాన్పూర్, జూన్ 7: కరోనా నియంత్రణ చర్యల్లో అందరూ భాగస్వాములుకావాలని గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద కరోనా కట్టడి చర్యల్లో భాగంగా సర్పంచ్ నీలం సరిత అధ్యక్షతన సోమవారం ప్రజాప్రతినిధులు, ఆరోగ్య సిబ్బందికి సంబంధించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. కరోనా వైరస్ విస్తరించకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. వివాహ వేడుకల సమయాల్లో నిబంధనలను పాటిస్తూ నిర్ణీత సంఖ్యలో ఆహ్వానితుల మధ్యే వేడుక నిర్వహించుకోవాలని వివరించారు. కరోనా నివారణలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు క్రియాశీలక పాత్రను పోషించాలని కోరారు. పాజిటివ్ వచ్చిన వారందరూ బయట తిరగవద్దని సూచించారు. ఉత్తమ సేవలు అందిస్తున్న ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలకు ఏసీపీ శాలువా కప్పి సన్మానించి, మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. సమావేశంలో గోదావరిఖని టూటౌన్ సీఐ శ్రీనివాసరావు, కమాన్పూర్ ఎస్ఐ శ్యామ్ పటేల్, ప్రొహిబిషన్ ఎస్ఐ నవీన్కుమార్, ఉప సర్పంచ్ బొజ్జ రాజసాగర్ తదితరులున్నారు.
నిరుపేదలకు సహాయం చేయాలి
మానవతా దృక్పథంతో దాతలు నిరుపేదలకు సహాయం అందించాలని ఏసీపీ కోరారు. గుండారం, రాజాపూర్కు చెందిన సుమారు 40 మంది నిరుపేదలకు అనేయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమకూర్చిన నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిరుపేదలకు నిత్యావసరాలు అందించడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు నవీన్, సభ్యులు ఆరెల్లి ప్రశాంత్ గౌడ్, ధరణి మల్లేశ్వర్రావు, రాపెల్లి కొమురయ్య, కామ వెంకటేశ్వర్లు, మంగళారపు సతీశ్, రానా, ఆకుల తిరుపతి, దండె రజనీకాంత్, కుమార్, పోశాలు, ప్రేమ్, శ్రవణ్, అరవింద్, రాకేశ్, ఆకుల వరుణ్ తదితరులు పాల్గొన్నారు.