ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
46 మందికి పట్టాల పంపిణీ
ఇల్లంతకుంట, మే 7: నిరుపేదలకు ఇళ్ల పట్టాలిస్తామని గత ప్రభుత్వాలు తమ పబ్బం గడుపుకొని కాలం వెల్లదీశాయని, కానీ టీఆర్ఎస్ సర్కా రు హయాంలో అర్హులకు ఇళ్ల పట్టాలు అందజేశామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశా రు. శుక్రవారం మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల కేంద్రానికి చెందిన 46 నిరుపేద దళిత కుటుంబాలకు ఇల్లందకుంటలోని 261 సర్వే నంబర్లోని 3ఎకరాల 10 గుంటలను ప్రతి కుటుంబానికి 111గజాల చొప్పున ఫ్లాట్ ఏర్పాటు చేసి వారికి పట్టాలను అందజేశారు. ఈ సందరర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటి స్థలాలు లేక ఎన్నో యేళ్లుగా గత ప్రభుత్వాల చుట్టూ తిరిగినా వారికి ఫలితం దక్కలేదన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించామన్నారు. అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య, ఉప సర్పంచ్ సాదుల్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గొడుగు తిరుపతి, నాయకులు కూనబోయిన బాలరాజు. కాసుపాక శంకర్, రాములు, రమేశ్, కొమిరె శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.