ఎలిగేడు ఎంపీపీ స్రవంతి
ముస్లింలకు రంజాన్ కానుకలు
ఎలిగేడు, మే 7: టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎంపీపీ తానిపర్తి స్రవంతి తెలిపారు. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం పంపిన 97 దుస్తుల కానుకలను తహసీల్ కార్యాలయంలో ముస్లింలకు ఎంపీపీ, తహసీల్దార్ పద్మావతితో కలిసి శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని కులాలు, మతాలకు సమానమైన ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించారు. ఇక్కడ ఎంపీడీవో శ్రీనివాసమూర్తి, స్పెషల్ ఆఫీసర్ తిరుపతిరావు, ఎలిగేడు సర్పంచ్ బూర్ల సింధూజ, డీటీ శ్రీనివాస్, ఆర్ఐ శ్రీనివాస్, నాయకుడు తానిపర్తి మోహన్రావు ఉన్నారు.
జ్యోతినగర్, మే 7: రంజాన్ కొత్త దుస్తులను 23వ డివిజన్లో కార్పొరేటర్ దాసరి సావిత్రి పంపిణీ చేశారు. స్థానిక మోమీనగర్ మసీద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్పొరేటర్ ముస్లింలకు రంజాన్ కానుకలను అందజేశారు. ఇక్కడ మసీద్ సదర్ సాబ్ మహ్మద్ మూసా, జహీరొద్దీన్, అక్బర్, రియాజ్, ఖాజా, వాజిద్ పాషా తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీపీసీలోని రెండో డివిజన్లో కార్పొరేటర్ ఎన్వీ రమణారెడ్డి రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. ఇందిరమ్మకాలనీలోని మసీద్లో కార్పొరేటర్ 40మంది మహిళలకు చీరలను అందజేశారు. టీఆర్ఎస్ డివిజన్ కార్పొరేటర్ సుద్ధాల గోపాల్, నాయకులు పసుల ప్రకాశ్, శ్రీకాంత్, కవితారెడ్డి తదితరులు ఉన్నారు.
రామగిరి, మే 7: మండల కో-ఆప్షన్ సభ్యుడు ఇబ్రహీం ఆధ్వర్యంలో సెంటినరీకాలనీ మసీద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముస్లింలకు రంజాన్ కానుకలను కమాన్పూర్ ఏఎంసీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ హిందువులకు దసరా కానుకలు, క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకలు, ముస్లింలకు రంజాన్ కానుకలు అందిస్తున్న మనసున్న మా రాజు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఇక్కడ సర్పంచ్ అల్లం పద్మ తిరుపతి, నాయకులు కొమురయ్య, కాపుర బోయిన భాస్కర్, ఆసం తిరుపతి, బుద్దె ఉదయ్, మసీద్ కమిటీ సభ్యులు ఉన్నారు