రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
పౌర సరఫరాల కమిషనర్, జగిత్యాల కలెక్టర్కు సూచన
కథలాపూర్ మండలం తాండ్య్రాలలో సమస్యపై స్పందన
కథలాపూర్, జూన్ 6 : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాల గ్రామంలో ధాన్యం సేకరణ ప్రక్రియను తక్షణమే చేపట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పౌర సరఫరాల సంస్థ కమిషనర్తోపాటు, జిల్లా కలెక్టర్ రవికి సూచించారు. ఆదివారం కథలాపూర్ మండల పర్యటనలో భాగంగా వినోద్కుమార్ తాండ్య్రాల గ్రామానికి రాగా, గ్రామస్తులు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో ధాన్యం సేకరణ జరుగడం లేదని, వర్షాలు కురుస్తున్నాయని, ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన వినోద్కుమార్ కలెక్టర్ రవి, పౌర సరఫరాల శాఖ కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి జిల్లాలోని గోదాంలకు తరలించాలని సూచించారు. జిల్లాలోని గోదాంలలో స్థలం లేకపోతే పెద్దపల్లి జిల్లాలోని గోదాంలకు తరలించాలన్నారు. వర్షాలు కురిసి ధాన్యం తడిస్తే రైతులకు నష్టం జరుగుతుందని, అధికారులు జాప్యం చేయకుండా వెంటనే కొనుగోలు ప్రక్రియను చేపట్టాలన్నారు. ఆయన వెంట మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎంపీపీ జవ్వాజి రేవతి, జడ్పీటీసీ నాగం భూమయ్య, సర్పంచ్ గడిల గంగప్రసాద్, వైస్ ఎంపీపీ గండ్ర కిరణ్రావు, టీఆర్ఎస్ నాయకులు వర్ధినేని నాగేశ్వర్రావు, ఎండీ రఫీ, పాలెపు రాజేశ్ తదితరులున్నారు.