ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ రాజేశం
కాగజ్నగర్లో కొవిడ్ సర్వే తీరు పరిశీలన
కాగజ్నగర్టౌన్, మే 6 : కొవిడ్ నిర్ధారణ పరీక్షల సర్వేకు ప్రజలంతా సహకరించాలని అదనపు కలెక్టర్ రాజేశం సూచించా రు. పట్టణంలో మున్సిపల్ సిబ్బంది, అంగన్వాడీ , ఆశ వర్క ర్లు, మెప్మా సిబ్బంది చేపడుతున్న సర్వేను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్తో కలిసి గురువారం పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారు 15 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండి చికిత్స పొందాలన్నారు. అత్యవసరమైతే తప్పా బయటికి రావద్దని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే రూ. 1000 జరిమానాతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలోని 30 వార్డుల్లోని 13,660 ఇళ్లల్లో 30 టీంలు సర్వే చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. వారి వెంట డీఏవో భౌమిక్, రెవెన్యూ ఆఫీసర్ బాపు, రెవెన్యూ , మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
తిర్యాణి,మే 6 : మండలంలోని సగాపూర్, గుడిపేట, మోయిం ద, కన్నెపల్లి, గంభీరావుపేట, చతపల్లి, భీమారం, తలాండి, గోయగాం తదితర గ్రామాల్లో ఎంపీడీవో మహేందర్ ఆధ్వరం లో ఇంటింటా సర్వే చేపట్టినట్లు తహసీల్దార్ మల్లికార్జున్ తెలిపారు. జలుబు, జ్వరం, దగ్గు, తదితర లక్షణాలు ఉన్నవారిని దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించినట్లు వారు పేర్కొన్నారు. సర్వేకు ప్రజలందరూ సహకరించాలని కో రారు. గ్రామపంచాయతీ, అంగన్వాడీ, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచ్లు ఉన్నారు.
దహెగాం, మే 6 : మండల కేంద్రంలో ఇంటింటా సర్వేను ఎం పీడీవో సత్యనారాయణ గురువారం ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ లక్షణాలు ఉన్నవారి వివరాలను సేకరించాలన్నారు. సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అదేవిధంగా తప్పకుండా మాస్కు పెట్టుకోవాలని, శానిటైజర్ వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఎంపీవో రాజేశ్వర్, డీటీ బక్కయ్య, మోహన్, ఆర్ఐ, ఏఎన్ఎంలు, జీపీ కార్యదర్శులు, అంగన్వాడీ, ఆశ కా ర్యకర్తలు, వీఆర్ఏలు పాల్గొన్నారు.
కౌటాల, మే 6 : మండలకేంద్రంలో ప్రత్యేక టీం గురువారం ఇంటింటా సర్వే చేపట్టారు. సభ్యులు ఎవరైనా రోగాల బారిన పడ్డారా..?, జ్వరం, దగ్గు, శ్వాస సమస్య, ఇతర ఏమైనా అనారోగ్య పరిస్థితులను నమోదు చేసుకున్నారు. కార్యదర్శి సాయికృష్ణ, వీఆర్వో భాస్కర్, వీఆర్ఏ ప్రకాశ్, కారోబార్ భాస్కర్, ఆశ వర్కర్లు ఉన్నారు.
ఆసిఫాబాద్టౌన్, మే 6: మండలంలోని మోతుగూడ, రహపల్లిలో సర్వేను ఎంపీవో అధికారి ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరూ టీకా తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
కెరమెరి, మే 6: కొవిడ్ నివారణకు అధికారులు కలిసికట్టుగా పని చేయాలని జడ్పీ సీఈవో రత్నమాల పేర్కొన్నారు. మండలంలోని ఝరి, మోడి, కెరమెరి, కెస్లాగూడ గ్రామపంచాయతీల్లో సర్వేను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అవసరమున్న వారికి పరీక్షలు, వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జడ్పీటీసీ సెడ్మాకి ధుర్పతాబాయి, ఎంపీడీవో దత్తారాం, డిప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్ నాయక్, వైద్యాధికారి సుంకన్న, జిల్లా సార్మేడి కోవ దేవ్రావ్, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
లింగాపూర్, మే 6: మండలంలో ఇంటింటి సర్వేలో ఎంపీడీవో ప్రసాద్, తహసీల్దార్ రమేశ్, అధికారులు పాల్గొన్నారు. 1729 కుటుంబాల వివరాలు సేకరించి 33 మందికి జ్వరంతో ఉన్నట్లు గుర్తించారు. ఎంపీవో ఉమర్ షరీఫ్, కార్యదర్శులు, వైద్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
జైనూర్, మే 6: సిర్పూర్-యు మండలంలోని ఖాతీగూడ గ్రామంలో ఎంపీడీవో మధుసూదన్, డీటీ , వైద్యసిబ్బందితో కలిసి సర్వేలో పాల్గొన్నారు. మండల ప్రత్యేకాధికారి సజీవన్, డీటీ సంతోష్, ఐకేపీ ఏపీఎం వెంకట్రెడ్డి, ఏఎన్ఎం కవిత తదితరులు ఉన్నారు.