రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
గోదావరిఖని/యైటింక్లయిన్ కాలనీ/ జ్యోతినగర్, ఆగస్టు 5: పేదల కష్టాలను తొలగించి వారి ముఖాల్లో ఆనందం నింపుతున్న పేదోళ్ల దేవుడు సీఎం కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కొనియాడారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 6,7,8,9, కోదండ రామాలయంలో 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 33 డివిజన్లకు చెందిన, రామగుండం, ఎన్టీపీసీలోని కేజీఎన్ ఫంక్షన్ హాల్, ఆర్ఆర్ గార్డెన్లో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. 179 మందికి కల్యాణలక్ష్మి, 11 మందికి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనాతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. ఆయన పై అవాకులు చేవాకులు మాట్లాడితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
టీఆర్ఎస్లో 200 మంది చేరిక
అనంతరం రామగుండం కార్పొరేషన్ ఏరియా గంగపుత్ర సంఘం నాయకులు సుమారు 200 మంది టీఆర్ఎస్లో చేరగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గంగపుత్రుల జీవన శైలి మారిపోయిందన్నారు. మత్స్య సంపద పెరిగి మత్స్యకారులకు ఉపాధి మార్గాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు.
శృతికి అభినందన
ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన గోదావరిఖనికి చెందిన శృతిని ఎమ్మెల్యే చందర్ అభినందించారు. గోదావరిఖని పవర్హౌస్ కాలనీలోని ఆమె నివాసంలో కలిసి సన్మానించారు. కార్యక్రమాల్లో మేయర్ అనిల్కుమార్, మూల విజయారెడ్డి, ఎంపీపీ అనసూర్యారాంరెడ్డి, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, జడ్పీటీసీ ఆముల నారాయణ, కార్పొరేటర్లు అడ్డాల గట్టయ్య, ఐత శివ, వేగోళపు రమాదేవి, కవిత సరోజని, సాగంటి శంకర్, తాళ్ల అమృతమ్మ, అంజలి, కన్నూరి సతీశ్కుమార్, కుమ్మరి శ్రీనివాస్, ఎన్వీ రమణారెడ్డి, క్రిష్ణవేణి, జ్యోతి, సరోజన, నీల పద్మ, సర్పంచ్ బండారి ప్రవీణ్, తహసీల్దార్ రమేశ్, ఫ్యాక్స్ చైర్మన్ ప్రభాకర్, కోదండ రామాలయ చైర్మన్ రవీందర్ రావు, నాయకులు బొడ్డు రవీందర్, కాల్వ శ్రీనివాస్, నీల గణేశ్, రాగం శ్రీనివాస్, అడప శ్రీనివాస్, గోపాల్ రావు, వీరారెడ్డి, పులి రాకేశ్, కుమార్ నాయక్, కుమ్మరి శారద, బుర్ర శంకర్గౌడ్, తానిపర్తి గోపాల్రావు, సలీంబేగ్, సుద్దాల గోపాల్, పిట్ట సమ్మయ్య, శంకర్, ఊడం మల్లేశ్, జూనియర్ అసిస్టెంట్ అనిల్రెడ్డి తదితరులున్నారు.