మల్యాల, జూన్ 4: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో కొండగట్టు అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖండ హనుమాన్చాలీసా పారాయణం ముగిసింది. రెండు మండలాలలపాటు పారాయణం కొనసాగింది. శుక్రవారం మల్యాలకు చెందిన మఠమాంజనేయ స్వామి ఆలయ భజన బృందం సభ్యులతో పాటు కరీంనగర్కు చెందిన గాయకుడు శ్రీనివాస్ కలిసి హనుమాన్చాలీసా పారాయణాన్ని 11సార్లు కొనసాగించారు. ఆలయ స్థానాచార్యులు జితేంద్రప్రసాద్, ప్రధాన అర్చకులు రామకృష్ణ, ఆలయ ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య అభిషేకం, హారతి తదితర కార్యక్రమాలను నిర్వహించారు. నిత్య హనుమాన్చాలీసా పారాయణం నిర్వహించిన అర్చకులు, భజనమండలి సభ్యులను ఎమ్మెల్యే రవిశంకర్ సత్కరించా రు. కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్-దీవెన దంపతులు, మల్యాల జడ్పీటీసీ దంపతులు కొండపలుకుల రాంమోహన్రావు-గోదాదేవి, మల్యాల ఎంపీపీ మిట్టపల్లి విమల-సుదర్శన్ దంపతు లు, స్థానిక సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, కొడిమ్యాల ఎంపీపీ, జడ్పీటీసీలు మేన్నేని స్వర్ణలత, పునుగోటి ప్రశాంతి, దాత చక్రపాణి, తాటిపాముల రాజేందర్, అయిల్నేని కోటేశ్వర్రావు, జున్న సురేందర్, భజన మండలి సభ్యు లు మిట్టపల్లి లక్ష్మీనారాయణ, ఆంజనేయులు, మనోహర్, వకుళాభరణం సామ్రాట్, జాగృతి నాయకులు పాసు ల చరణ్, ప్రవీణ్రావు, నీలగిరి రాజేంధర్రావు, వొద్దినేని వెంకటేశ్వర్రావు, వొల్లా ల శ్రీనివాస్గౌడ్, వాయిద్యా కళాకారులు డోలక్ రాజు, కిట్ల శ్రీనివాస్, వరాల వెంకన్న, నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.