వచ్చే జూన్ నాటికి 50 వేల ఎకరాలకు సాగునీరు
రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
కాళేశ్వరం ప్యాకేజీ 27 రీటెండర్ పనులకు భూమిపూ
దిలావర్పూర్ జూన్ 4: కాళేశ్వరం ప్యాకేజీ 27తో 50 వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ప్యాకేజీ 27 పనులకు శుక్రవారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే జూన్ నాటికి నిర్మల్ నియోజక వర్గంలోని 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నా రు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి రివర్స్ పంప్ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి నీరు తీసుకువచ్చి సాగు, తాగు నీటికి ఇబ్బందుల్లేకుండా చూస్తున్నామని చెప్పారు. కరోనా మూలంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ ప్యాకేజీ 27 పనులకు మరో రూ. 290 కోట్లు మంజూరు చేశారని ఆయన తెలిపారు.
మన పథకాలు దేశానికే ఆదర్శం..
తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. న్యూ లోలం గ్రామంలో నిర్మించిన మోడల్ అంగన్వాడీ భవనం, పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ నెట్ ప్రాక్టీస్, వాలీబాల్, షటిల్ కోర్టులను ప్రారంభించి కాసేపు సరదాగా బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. అనంతరం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, స్థానిక సర్పంచ్లు ఓడ్నం సవిత, వీరేశ్కుమార్, శ్రీనివాస్, ఎంపీపీ ఏలాల అమృత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్ముల దేవేందర్రెడ్డి, రైతుబంధుసమితి జిల్లా సభ్యుడు ఏలాల చిన్నారెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు డాక్టర్ సుభాష్రావు, మాజీ ఎఫ్ఎస్సీఐ చైర్మన్ రాంకిషన్రెడ్డి, కదిలి , కాల్వ ఆలయాల చైర్మన్లు భుజంగ్రావు, చిన్నయ్య, ఎంపీటీసీలు పాల్ధే అక్షరా అనిల్, మం డల కోఆప్షన్ సభ్యుడు అన్వర్ఖాన్, మాజీ సర్పంచ్లు రామాగౌడ్, స్వామిగౌడ్, ఇప్ప నర్సారెడ్డి, ఎంపీడీవో మోహన్రెడ్డి, ఎంపీవో అజీజ్ఖాన్, ఏవో స్రవంతి, టీఆర్ఎస్ నాయకులు గోవిందుల మహేశ్, ఆనందం, గుణవంతరావు, డీ అనిల్ కుమార్, కృష్ణ, రమణ, ముత్యం, మహేశ్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
సేవా కార్యక్రమాలు అభినందనీయం
నిర్మల్ అర్బన్, జూన్ 4 : కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నా రు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలకు మధ్యాహ్నా భోజన పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరై ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 10 రోజులుగా రాము పోలీసులు, పారిశుధ్య కార్మికులు, పాదచారులు, భిక్షాటన చేసే వారికి భోజనం అందిస్తున్నాడని, ఆయనను ఆదర్శంగా తీసుకొని మరికొంత మంది పేదలకు సాయం చేయాలని కోరారు. జ్వరసర్వే, లాక్డౌన్తో జిల్లా లో పాజిటివ్ కేసులు చాలావరకు తగ్గాయన్నారు. అనంతరం ఆనంద్ రెడ్డి 1000 ఎన్ 95 మాస్కులను పారిశుధ్య, ఆరోగ్య సిబ్బందికి, ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మదా రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, కౌన్సిలర్లు గండ్రత్ రమణ, బిట్లింగు నవీన్, ఎడిపెల్లి నరేందర్, నాయకులు మారుగొండ నరేందర్, మేడారం ప్రదీప్, మహేశ్ రెడ్డి, నర్సాగౌడ్, రిజ్వాన్, అఖిల్ మున్సిపల్ కమిషనర్ ఎన్ బాలకృష్ణ, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ తదితరులు ఉన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించాలి
నిర్మల్ అర్బన్, జూన్ 4 : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో కోరా రు. పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటి హరతహార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి, ఈపీటీఆర్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే వర్చువల్ ద్వారా సమావేశంలో ప్రసంగించనున్నట్లు ఆయన తెలిపారు.