వైభవంగా శివుడికి రుద్రాభిషేకం
సుదర్శన నారసింహ హోమం
యాదాద్రి, ఆగస్టు 2: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో హరిహరులకు సోమవారం ప్రత్యేక పూజల కోలా హలం నెలకొంది. వైష్ణవాగమశాస్త్ర రీతిలో యాదాద్రీశుడికి, శై వాగమశాస్త్రరీతిలో కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్ధనీ సమేత రామలింగేశ్వరుడి పూజలు జరిగాయి. శివుడికి రుద్రాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని రుద్రాభిషేకం జరిపించారు. ఉదయాన్నే శివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు విభూతితో అలం కరించారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు అభిషేకం చేసి అర్చ న చేశారు. శివాలయం ఉప ప్రధాన పురోహితుల ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు. నిత్యపూజలు ఉదయం నాలు గు గంటల నుంచి మొదలయ్యాయి. బాలాలయంలో కవచ మూర్తులను అభిషేకించి అర్చించిన అర్చక బృందం బాలాల యంలో సుదర్శన నారసింహ హోమం జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవాన్ని ఆగమశాస్త్ర రీతిలో నిర్వహించారు. భక్తులు స్వామివారి నిత్య కైంకర్యాల లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఖజానాకు రూ. 7,33,772 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ.7,33,772 ఆదాయం వచ్చినట్లు ఆల య ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 98,724, రూ. 100 దర్శనంతో రూ. 21,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ.26,850, నిత్య కైంకర్యాలతో రూ. 3,000, క్యారీ బ్యా గులతో రూ.1,650, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా రూ.16,000, కల్యాణకట్టతో రూ.11,600, ప్రసాద విక్రయం తో రూ.3,04,890, శాశ్వతపూజల ద్వారా రూ. 17,232, వాహన పూజలతో రూ. 6,000, టోల్గేట్తో రూ. 550, అ న్నదాన విరాళంతో రూ. 31,180, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 92,720, యాదరుషి నిలయంతో రూ.28,150, పా తగుట్టతో రూ. 7,730, టెంకాయల విక్రయాలతో రూ. 21, 000, ఇతర విభాగాలతో రూ. 45,496తో కలుపుకొని రూ.7, 33, 772 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.