కంది, ఆగస్టు 2: సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఐఐటీ హైదరాబాద్లో నూతన స్కూల్ క్యాంపస్ను ప్రారంభించారు. సోమవారం ఐఐటీ బోర్డు ఆఫ్ గవర్నర్ డాక్టర్ బీవీ మోహన్రెడ్డి ఐఐటీలో ఉన్న దయానంద్ ఆంగ్లో వేదిక్ (డీఏవీ)కు నూతనంగా కేటాయించిన క్యాంపస్ను ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తితో కలిసి ఆయన ప్రారంభించారు. గతంలో ఇక్కడ ఉన్న క్యాంపస్ బిల్డింగ్లో తాత్కాలికంగా కొనసాగుతున్న ఈ స్కూల్కు పూర్తిస్థాయి క్యాంపస్ను కేటాయించారు. ప్రస్తుతం ఈ స్కూల్లో ఎల్కేజీ నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నారు. ఐఐటీ అంటేనే ఓ అద్భుతమని అలాంటి క్యాంపస్లోని స్కూల్లో చదివే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మోహన్రెడ్డి సూచించారు. కార్యక్రమంలో డీఏవీ స్కూల్ ప్రిన్సిపల్ వీఎస్ప్రశాంత్ ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.