మునిపల్లి, ఆగస్టు 2: మండల పరిధిలోని బుధేరా చౌరస్తాలో నిర్వహించిన ఊరడమ్మ జాత ర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సో మవారం బుధేరా చౌరస్తాలో కొనసాగుతున్న ఊరడమ్మ ఉత్సవాల్లో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఊరడమ్మ ఉత్సవాలు జరుగడంతో బుధేరా చౌరస్తాలో సందడి నెలకొన్న ది. చౌరస్తాలోని ప్రధాన వీధుల గుండా మహిళలు బోనా లు ఊరేగిస్తూ అమ్మవారికి సమర్పించారు. బోనాల ఊరేగింపు కార్యక్రమంలో శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీపీ శైలజాశివశంకర్, జడ్పీటీసీ మీనాక్షిసాయికుమార్, టీఆర్ఎస్ మండల పార్టీ కార్యదర్శి శశికుమార్, రాష్ట్ర నాయకులు సాయికుమార్, బుధేరా గ్రామ శాఖ అధ్యక్షుడు బోయిని రవీందర్, టీఆర్ఎస్ మండల యుత్ లీడర్ బోయిని మల్లేశం, అశోక్, నాయకులు శ్రీనివాస్, బాలకృష్ణ, వెంకటేశం, రాజేందర్ ఉన్నారు.
టీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి
మునిపల్లి, ఆగస్టు 2: టీఆర్ఎస్ హయాంలోనే పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పా టు చేసిన మండలానికో మాడల్ పల్లెప్రకృతి వనం నిర్మాణానికి మండలంలోని పెద్దగోపులారం శివారులో గల ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిలో పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే గ్రామాలు అభివృద్ధి బాట పట్టి పక్కగ్రామాలతో పోటీపడుతున్నాయన్నారు. తెలంగాణ సర్కార్ గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు మం జూరు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శైలజా శివశంకర్, జడ్పీటీసీ మీనాక్షిసాయికుమార్, సర్పంచ్ కీర్తికుమారి, నాయకులు సాయికుమార్, శశికుమార్, ఆనంద్, బాగన్న, నర్సింలు, గరీబోద్దీన్,రాజేందర్, మౌలానా, శ్రీనివాస్, గోరెమియా ఉన్నారు.