వరుస దొంగతనాలతో భయం గుప్పెట్లో జనం
ఎట్టకేలకు కేసును ఛేదించిన పోలీసులు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ మధుసూదన్రావు
కోస్గి, ఆగస్టు 2 : పట్టణంలో దొంగతనాలు చే స్తూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తి ని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. సోమవా రం విలేకరుల సమావేశంలో డీఎస్పీ మధుసూదన్రావు వివరాలు వెల్లడించారు. జూలై 23న పట్టణంలోని బీఎన్జీ మొబైల్ షాపులో అర్ధరాత్రి ఓ వ్యక్తి చొరబడి సుమారు రూ.1,30 వేల నగదు, నాలుగా సెల్ఫోన్ల విలువ రూ.80,000 ఎత్తుకెళ్లా డు. జూలై 24న ఉదయం షాపునకు వచ్చిన యజమాని నరేందర్ దుకాణంలో చోరీ జరిగినట్లు గు ర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో దుకా ణం ఎదుట ఉన్న సీసీ కెమెరా, దొంగ ఎత్తుకెళ్లిన ఫోన్ల ఈఎంఐ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మండలంలోని బలబద్రాయపల్లికి చెంది న సీతానర్సింహులు ఈ దొంగతనానికి పాల్పడిన ట్లు అనుమానంతో పోలీసులు విచారించగా నేరా న్ని ఒప్పుకున్నారు. దొంగ నుంచి నాలుగు సెల్ఫోన్లు, రూ.లక్షా ఇరవై వేలను రికవరీ చేసినట్లు డీ ఎస్పీ తెలిపారు. గతంలో చిన్న చిన్న కేబుల్ దొంగతనాలు చేశాడని పోలీసులు తెలిపారు. అతడిని రిమాండ్కు తరలిస్తున్నామని, ఆధారాలను కోర్టు కు సమర్పిస్తామని డీఎస్పీ చెప్పారు. కార్యక్రమం లో సీఐ రాంలాల్, ఎస్సై నరేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.