జిన్నారం, ఆగస్టు2: పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు కానుండడంతో ప్రజల చిరకాల కల సాకారమైనదని జిన్నారం టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ జిల్లా నాయకుడు జీ. వెంకటేశంగౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, నరేశ్, బ్రహ్మేందర్ గోకరి శ్రీధర్ తదితరులు కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిని, జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్ను కలిసి మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటుకు కృషి చేసిన మంత్రులు కేటీఆర్, మంత్రి హరీశ్రావు, ప్రొటెం చైర్మన్ వీ.భూపాల్రెడ్డి కృషి అభినందనీయమని సంతోషం వ్యక్తం చేశారు.
మంత్రికి కృతజ్ఞతలు
గుమ్మడిదల, ఆగస్టు 2: పటాన్చెరు నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు కోసం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలుపడంతో నియోజకవర్గ ప్రజల సంబురాలు అంబరాన్నంటాయి. జడ్పీటీసీ కుమార్గౌడ్, ఎంపీపీ సద్దిప్రవీణావిజయభాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరేందర్రెడ్డి, సీనియర్ నాయకులు సద్ది విజయభాస్కర్రెడ్డి, గోవర్ధన్రెడ్డి మంత్రి హరీశ్రావు, ప్రొటెం చైర్మన్ వీ.భూపాల్రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ స్సెషాలిటీ దవాఖాన ఏర్పాటు కానునందున నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి రానుందని హర్షం వ్యక్తం చేశారు. మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కృషితో సూపర్ స్పెషాలిటీ దవాఖాన రానుందని సంతోషం వ్యక్తం చేశారు.