యాచారం, ఆగస్టు1: మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నూ తనంగా నిర్మించిన అతిథి గృహం ప్రారంభానికి ముస్తాబైంది. అతిథి గృహం నిర్మాణానికి అప్పటి జిల్లాపరిషత్ చైర్పర్సన్ పట్నం సుని తా రెడ్డి రూ.10లక్షల జడ్పీ నిధులు మంజూరు చేశారు. మొదట్లో నిధు లు సరిపోకపోవడంతో భవన నిర్మాణం అసంపూర్తిగా మిగిలి పోయింది. ప్రస్తుత జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ చొరవతో అదనంగా జిల్లా పరిషత్ నిధులు రూ.5లక్షలు ఖర్చు చేసి భవనానికి తుది మెరుగులు దిద్దడంతో పాటుగా అతిథి గృహంలో వివిధ రకాల ఫర్నిచర్లను సమకూర్చారు. దీంతో ప్రస్తుతం భవనం పూర్తి స్థాయి నిర్మాణంతో ప్రారంభానికి సిద్దంగా ఉంది. నూతనంగా నిర్మించిన అతిథి గృహం సాగర్ రహదారి పక్కనే ఉండటం, హైదరాబాద్కు సమీపంలో ఉండటంతో ఇటువైపు రాకపోకలు కొనసాగించే అధికా రులకు, ప్రజాప్రతినిధులకు, వీఐపీలకు ఈ గెస్ట్హౌస్ ఎంతో ఉప యోగకరంగా ఉంటుందని పలువురు అంటున్నారు.
త్వరలో ప్రారంభిస్తాం: చిన్నోళ్ల జంగమ్మ, జడ్పీటీసీ
మండల పరిషత్ ఆవరణలో నూతనంగా నిర్మించిన అతిథి గృహాన్ని త్వరలో ప్రారంభిస్తాం. గతంలో నిధులు సరిపోకపోవడంతో భవనా న్ని పూర్తి చేయడంలో జాప్యం కొనసాగింది.ప్రభుత్వ సహకారంతో మరో ఐదులక్షల అదనపు నిధులతో పూర్తిస్థాయి నిర్మాణం చేపట్టాం. త్వరలో ప్రారంభించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. గెస్ట్ హౌస్ నిర్మాణం అందరికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.