ఉదయం నుంచే రంగంలోకి పోలీసులు
పల్లె, పట్టణాల్లో నిఘా.. పెట్రోలింగ్ వాహనాలతో గస్తీ
నిర్మల్ జిల్లాలో పకడ్బందీగా లాక్డౌన్ అమలు
విస్తృతంగా పర్యటిస్తున్న ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్కుమార్
ఇప్పటివరకు 1,326 కేసులు, 2,820 వాహనాలు సీజ్
నిర్మల్ అర్బన్, జూన్ 1: కరోనాను కట్టడి చేసేందుకు సర్కారు లాక్డౌన్ అస్ర్తాన్ని ప్రయోగించింది. సీఎం కేసీఆర్ పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను కూడా ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు క్షలు చేసి ఇంటికి పంపిస్తున్నారు. కాగా.. ఇప్పటివరకు నిర్మల్ జిల్లాలో 1326 కేసులు నమోదు కాగా.. 2,820 వాహనాలను సీజ్ చేశారు.
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను జిల్లాలో పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్కుమార్ ఎప్పటికప్పుడు లాక్డౌన్ పరిస్థితిని పరిశీలిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. నిర్మల్ జిల్లా మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతంలో ఉన్న ప్రదేశాల్లో ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేసి నిఘాను పటిష్ట పరుస్తున్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు గడువును ప్రజలు సద్వినియోగం చేసుకొని లాక్డౌన్కు సహకరించాలని పోలీసులు సూచిస్తున్నారు. అనవసరంగా బయట తిరిగిన వారిని పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో ఐసొలేషన్ కేంద్రానికి తరలించి కరోనా పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని దవాఖానకు తరలిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పట్టణ, మున్సిపల్ పరిధిలోని కాలనీల్లో పోలీసులు నిఘాను పటిష్టం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 400 మంది పోలీసులు మూడు షిఫ్టులో నిరంతరం విధులు నిర్వహిస్తున్నారు. 8 గంటలకు ఒక షిఫ్టు చొప్పున మూడు షిఫ్టులను అమలు చేసి పోలీసులకు విధులు కేటాయించారు.
వైరస్ కట్టడికి అవగాహన
కరోన వైరస్ కట్టడికి పోలీసులు విస్తృతంగా ప్రజలు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంట్లో ఉంటే కలిగే లాభాలు, అనవసరంగా రోడ్లపైకి వస్తే కలిగే పరిణామాలు వివరిస్తున్నారు. పోలీసులు ప్రారంభించిన ప్రచారరథం జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ లాక్డౌన్ నిబంధనలు ప్రజలకు వివరిస్తున్నది. లాక్డౌన్ ఉద్దేశం, నిబంధనలు ఎలా పాటించాలి, ఉల్లంఘిస్తే తీసుకునే చర్యలు, కేసులపై ప్రచారం నిర్వహిస్తున్నారు.
జిల్లాలో 1326 కేసులు..2820 వాహనాలు సీజ్
జిల్లాలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం వరకు మాస్కులు లేకుండా బయట తిరిగిన 1326 మందిపై కేసులు నమోదు చేసి రూ.13,26,000 జరిమానా విధించారు. లాక్డౌన్ సమయంలో బయట తిరుగుతున్న 2820 వాహనాలు సీజ్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. వీటిని లాక్డౌన్ ముగిసిన తర్వాత వాహనదారులకు అప్పగించనున్నారు. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఏపీడీమిక్ డీసీజెస్ చట్టం కింద 17 కేసులు నమోదు చేశారు.