కొత్తకోట, జూలై 31 : సొంత ప్రయోజనాలకు పార్టీ మారుతూ ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజల ముందుకు వస్తూ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిని విమర్శించే అర్హత డోకూరు పవన్కుమార్రెడ్డికి లేదని జెడ్పీ వైస్చైర్మన్ వామన్గౌడ్ అన్నారు. శనివారం పట్టణంలోని ఆయన ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డోకూరు పవన్కమార్రెడ్డి పోటీ చేస్తే ఆయనపై ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మొదటి సారి 17వేలు, రెండో సారి 34వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారన్నారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తారని ఆయన అన్నారు. ఓటమితో పిచ్చిక్కినట్లు మాట్లాడటం డోకూరు పవన్కుమార్రెడ్డికి అలవాటుగా మారిందని, ఇంక ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారే ప్రబుద్ధుడు నీవని, ప్రజల సంక్షేమం పట్టని నీకు ప్రజల గురించి ఏమి తెలుసునని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి నియోజక వర్గ ప్రజల సంక్షేమం కోసం పాటుపడే నాయకుడన్నారు. 70 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ నాయకులు కనీసం ఇటు వైపు ఉన్న కాజ్వేల నిర్మాణం కోసం పాటు పడలేదన్నారు.
కనిమెట్ట, పాతజంగమాయపల్లి కాజ్వే కోసం రూ.12.30కోట్లు, పామాపురం, వీరరాఘవపురం కాజ్వేకు రూ.16కోట్లు, మదనాపురం వద్ద కాజ్వేకు రూ.13కోట్లు, పల్లెపల్లెకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారన్నారు. పట్టణంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరుగుతుంటే మీకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ కొండారెడ్డి, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, మండల ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, కౌన్సిలర్లు రామ్మోహన్రెడ్డి, అయ్యన్న, రవీందర్రెడ్డి, తిరుపతయ్య, విద్యార్థి విభాగం నాయకుడు శ్రీనుజీ, కోఆప్షన్ సభ్యులు వసీంఖాన్, వహీద్, నాయకులు భీంరెడ్డి, సుభాష్, సత్యంయాదవ్, వికాస్, కిరణ్, మహేశ్, నవీన్, సాధిక్ తదితరులు పాల్గొన్నారు.