త్వరలోనే మంత్రి కేటీఆర్తో షాపింగ్ కాంప్లెక్స్కు శంకుస్థాపన
సర్వసభ్య సమావేశంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్
మెదక్ మున్సిపాలిటీ, జూలై 31 : మిషన్ భగీరథ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ ఆదేశించారు. శనివారం మెదక్ మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. గౌరవ సభ్యులు కృష్ణారెడ్డి, జయరాజ్, సుం కయ్య, మేఘమాల, బట్టిలలిత తదితరులు పలు అంశాలను సభా దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడారు. సభ్యులు లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకుందామని హామీ ఇచ్చారు. పట్టణంలో భగీరథ పనులు 90శాతానికి పైగా పూర్తయ్యాయని, మిగిలిన 10శాతం పూర్తికాగానే త్వరలోనే పూర్తి చేస్తామని డీఈ మహేశ్ పేర్కొనగా, త్వరలోనే దీనిపై సమావేశం నిర్వహిస్తామని చైర్మన్ చెప్పారు. మిషన్ భగీరథ పనులతో ఏర్పడిన గుంతలను త్వరలోనే మరమ్మతులు చేయాలని, పాత బస్టాండ్ నుంచి గుట్టపై గల వాటర్ ట్యాంక్ వరకు, చమన్ నుంచి పిట్లంబేస్, దయార వరకు, నర్స్ఖేడ్ రోడ్లకు వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని చైర్మన్ సూచించా రు. వ్యాపారస్తులు అడిగితేనే భగీరథ నల్లా కనెక్షన్ ఇవ్వాలని, అడగక ముందే ఇవ్వొద్దని సూ చించారు. హరితహారం లో భాగంగా నాటిన మొక్కలకు రక్షణ కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాత బస్టాండ్ వద్ద గల 13 మున్సిపల్ దుకాణా ల అగ్రిమెంట్ ముగియగానే రీటెండర్లు నిర్వహిస్తామని తెలిపారు. రాందాస్ చౌరస్తా లో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్ను మంత్రి కేటీఆర్తో శంకుస్థాపన చేయిస్తామన్నారు.
ఐడీఎస్ఎంటీ-2లో ప్లాట్ల కోసం డబ్బులు చెల్లించిన వారికి త్వరలోనే ప్లాట్లు అందేలా కృషి చేస్తానన్నారు. ప్రధాన రోడ్లపై గాడిదలను వదిలే వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ శ్రీహరిని ఆదేశించారు. డంపింగ్ యార్డుకు వెళ్లే దారికి నిధులు మంజూరైనా సీసీ పనులు ఎందుకు ప్రారంభించలేదని ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అనంతరం ఎజెండాలోని అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో వైస్ చైర్మన్ మల్లికార్జుగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీనివాస్, కిశోర్, శేఖర్, బట్టి లలిత, గడ్డమీది యశోద, చందన, వేదవతి, మున్సిపల్ ఏఈలు సిద్ధేశ్వరీ, బలసాయగౌడ్, రెవెన్యూ అధికారి అర్షద్, టీపీఎస్ లక్ష్మీపతి, శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత, టెక్నికల్ ఇన్స్పెక్టర్ సలీం, చంద్రమోహన్, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.