మెదక్, జూలై 31 : నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పేదలకు వైద్య ఖర్చుల కోసం సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ పథకాన్ని ప్రవేశపెట్టారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి తెలిపారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో మెదక్ నియోజకవర్గంలోని హవేళీఘనపూర్, నిజాంపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట మండలాలకు చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాలకు చెందిన 35 మంది బాధితులకు రూ.18 లక్షల 57 వేల 440 విలువైన చెక్కులను అందజేశామని చెప్పారు. కార్యక్రమంలో హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, సర్పంచ్లు దేవాగౌడ్, రాజేందర్రెడ్డి, ప్రభాకర్, శ్రీనునాయక్, సుభాశ్, సిద్ధాగౌడ్, వినోద్, రమేశ్, సాయాగౌడ్, రమేశ్ నాయక్, శ్రీహరి, శ్రీకాంత్, ఫుల్సింగ్, ఎంపీటీసీలు సిద్ధిరెడ్డి శ్రీనివాస్, రాజిరెడ్డి, రాజయ్య, ప్రవీణ్, ఉపసర్పంచ్లు పాల్గొన్నారు.