గాదిగూడ, మే 31: లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఎస్ఐ సయ్యద్ ముజాహిద్ పోలీస్ సిబ్బందికి సూచించారు. మండలంలోని లోకారి(కే) గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 6 నుంచి మధాహ్నం 1 గంట వరకు దుకాణాలు తెరిచి ఉంచేలా చూడాలన్నారు. లాక్డౌన్ సమయంలో అనవసరంగా బయటకు వస్తే జరిమానా విధించాలని సూచించారు. ఆయన వెంట హెచ్ఈవో రవీందర్, హెచ్ఏ మోహన్, సిబ్బంది ఉన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
నార్నూర్, మే 31: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ డీ రమేశ్ అన్నారు. మండల కేంద్రంలోని గాంధీచౌరస్తా వద్ద పర్యవేక్షించారు. మధ్యాహ్నం నుంచి మార్కెట్లో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. జనం కనిపించకపోవడంతో వీధులు నిర్మానుష్యంగా మారాయి. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు.
పకడ్బందీగా లాక్డౌన్
బోథ్, మే 31: మండలంలో లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగుతున్నది. ప్రభుత్వం సడలింపు సమయం పెంచడంతో సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. అనవసరంగా బయట తిరిగితే ఆదిలాబాద్లోని ఐసొలేషన్ కేంద్రానికి తరలిస్తామని హెచ్చరించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పనులు ముగించుకొని ఇళ్లకు చేరుకోవాలని సీఐ నైలు, ఎస్ఐ రాజు సూచించారు. ఘన్పూర్ చెక్పోస్టును సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు.
ఇంద్రవెల్లి, మే 31: మండల కేంద్రంలోని వ్యాపారులు మధ్యాహ్నం 1 గంటకు దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. అంబేద్కర్ చౌక్, తెలంగాణతల్లి చౌక్ నిర్మానుష్యంగా కనిపించింది.
ముమ్మరంగా తనిఖీలు
ఇచ్చోడ, మే 31: మండల కేంద్రంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. సడలింపు అనంతరం రోడ్లునిర్మానుష్యంగా మారాయి.
బయట తిరగొద్దు
ఉట్నూర్, మే 31: లాక్డౌన్ సమయంలో అనవసరంగా బయట తిరగొద్దని ఎస్ఐ సుబ్బారావు అన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వాహనాలు తనిఖీ చేశారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు జరిమానా విధించారు. సిబ్బంది పాల్గొన్నారు.