రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
77 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
అంతర్గాం: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలో కల్యాణలక్ష్మి పథకం అమలు చేసి పేద కుటుంబాల్లో ఆనందం నింపుతున్నారని ఉద్ఘాటించారు. శుక్రవారం అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి రైతువేదికలో 77 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సకల వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం నిత్యం శ్రమిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్పై అనవసరమైన ఆరోపణలు చేస్తే తిప్పి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచీ ఇప్పటివరకు నియోజకవర్గంలో నాలుగు వేల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించామన్నారు.
కార్యక్రమం లో ఎంపీపీ దుర్గం విజయ, జడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి మహేందర్ రెడ్డి, సర్పంచులు బండారి ప్రవీణ్, ఏదులాపురం నీరజ వెంకటేశ్, కోళ్లూరి సతీశ్, గంగాధరి దేవమ్మ రాజన్న, కుర్ర వెంకటమ్మ నూకరాజు, ఎంపీటీసీ శరణ్య మధూకర్ రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యులు దివాకర్, మండల కో ఆప్షన్ సభ్యులు గౌస్ పాషా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తిరుపతి నాయక్, తహసీల్దార్ బండి ప్రకాశ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.