భువనగిరి మున్సిపల్చైర్మన్ ఆంజనేయులు
భువనగిరి టౌన్, ఏప్రిల్ 6: పట్టణంలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు సహకరించాలని భువనగిరి మున్సిపల్ చైర్మ న్ ఎనబోయిన ఆంజనేయులు అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో రోడ్డు విస్తరణపై మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడా రు. ప్రజలు, వాహనదారుల సౌకర్యార్థం రోడ్డు విస్తరణ పను లు చేపడుతున్నామని, రోడ్డు విస్తరణలో భాగంగా అడ్డాలు కో ల్పోతున్న చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపిస్తామని తెలిపారు. రోడ్డు విస్తరణతో భువనగిరి పట్టణం కొత్త అందాన్ని సంతరించుకుంటుందన్నారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నా యకులు పలు సూచనలు చేశారు. సమావేశంలో వైస్ చైర్మన్ కిష్టయ్య, కమిషనర్ పూర్ణచందర్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్కుమార్, బీజేపీ ఫ్లోర్ లీడర్ దశరథ, టీఆర్ఎస్, కాంగ్రె స్, బీజేపీ, టీడీపీ పట్టణ కమిటీ అధ్యక్షులు సుధాకర్రెడ్డి, స త్యనారాయణ, ఉమాశంకర్, శ్రీనివాస్, నాయకులు చంద్ర శేఖర్, సీపీఎం పట్టణ కార్యదర్శి కృష్ణ, సీఐటీయూ నేత పాం డు, సీపీఐ పట్టణ కార్యదర్శి శోభన్, ఏఐటీ యూసీ నాయకుడు ఇమ్రాన్, టౌన్ ప్లానింగ్ అధికారి కృష్ణవేణి పాల్గొన్నారు.